Rohit Sharma: మేం 30 పరుగులు తక్కువ చేశాం.. మా బౌలర్లు సూపర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Captain Rohit Sharma React on Victory vs England: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లలో టీమిండియా విజయం సాధించింది. లక్నో వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అద్భుత పోరాటంతో గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా దాదాపుగా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్లో కీలక సమయాల్లో వికెట్లను చేర్చుకుని తక్కువ స్కోరుకే పరిమితమైనా.. అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థిని 129 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ విజయంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బ్యాటింగ్లో తాము 30 పరుగులు తక్కువ చేసినా.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో గట్టెక్కామని చెప్పాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘జట్టులోని ప్రతి ఆటగాడికి ఈ మ్యాచ్ పరీక్ష పెట్టింది. క్లిష్ట పరిస్థితుల్లో అనుభవ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. మెగా టోర్నీలో ఇప్పటివరకు మేం ఆడిన తీరు వేరు, ఈ మ్యాచ్లో చేసిన పోరాటం వేరు. గత ఐదు మ్యాచ్లలో మేం లక్ష్య ఛేదనకు దిగాం. ఈసారి మాత్రం ముందుగా బ్యాటింగ్ చేశాం. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై ఇంగ్లీష్ బౌలర్ల అద్భుత బౌలింగ్ను ఎదుర్కొని స్కోరు బోర్డుపై మంచి లక్ష్యం ఉంచాం. అయితే బ్యాటింగ్లో ఆశించిన మేర రాణించలేదు. నాతో పాటు మరికొందరు అనవసరంగా వికెట్లను సమర్పించారు. 30 పరుగులు తక్కువ చేసాం’ అని అన్నాడు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
‘భారత బౌలింగ్ సూపర్. బౌలర్లు అద్భుతం చేశారు. ఆరంభంలో 2-3 వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే మా బౌలర్లు చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీసిఇంగ్లండ్ను కుదురుకోనీయలేదు. పిచ్ పరిస్థితులను కూడా కలిసొచ్చాయి. స్వింగ్తో పాటు పిచ్ నుంచి కూడా సహకారం లభించడంతో ఇంగ్లీష్ ఆటగాళ్లకు బ్యాటింగ్ కష్టంగా మారిపోయింది. మా బౌలర్ల అనుభవం మాకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ.. కొన్ని కీలక అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఈ విజయం బౌలర్లదే. వారి ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!