IND vs ENG: సబ్స్టిట్యూట్ ఫీల్డర్లుగా ఇంగ్లండ్ కోచ్లు.. కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paul Collingwood and Marcus Trescothick been listed as Substitute Fielders: ధర్మశాల వేదికగా శుక్రవారం భారత్తో ఆరంభమైన ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ టీమ్ తమ సబ్స్టిట్యూట్ ఫీల్డర్లుగా కోచ్ల పేర్లను ప్రకటించింది. కోచింగ్ స్టాఫ్ అయిన పాల్ కాలింగ్వుడ్, మార్కస్ ట్రెస్కోథిక్ల పేర్లను సబ్స్టిట్యూట్ ఫీల్డర్ల జాబితాలో ఇంగ్లండ్ చేర్చింది. దాంతో ఈ ఇద్దరూ కోచ్లు బ్రేక్ సమయాల్లో డ్రింక్స్ తీసుకుని మైదానంలోకి వచ్చారు. ఇందుకుసంబందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుటున్నాయి. కోచ్లు అయిన కాలింగ్వుడ్, ట్రెస్కోథిక్లు డ్రింక్స్ మోయడానికి కారణం ఏంటంటే.
ఐసీసీ నిబంధన ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రతి జట్టు గరిష్టంగా ఆరుగురు సబ్స్టిట్యూట్ ఫీల్డర్ల పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ ప్లేయర్స్ అందరూ అందుబాటులో లేరు. ఓలీ రాబిన్సన్ లూజ్ మోషన్స్తో ఇబ్బందిపడుతుండగా.. మరికొందరు ఆటగాళ్లకు గాయాలు అయ్యాయి. ఇంకొందరు ప్లేయర్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశం వెళ్లిపోయారు. దాంతో ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు 14 మందే అందుబాటులో ఉన్నారు. దాంతో ఇంగ్లండ్ తమ కోచింగ్ స్టాఫ్ను సబ్స్టిట్యూట్ ఫీల్డర్లుగా పేర్కొంది.
Also Read
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
Also Read: Raadhika Sarathkumar: విరుదునగర్ స్థానం నుంచి సినీనటి రాధికా శరత్కుమార్ పోటీ?
ఆటగాళ్లు గాయపడినప్పుడు లేదా అస్వస్థత గురైనప్పుడు సపోర్ట్ స్టాఫ్ సబ్స్టిట్యూట్లుగా బరిలోకి దిగుతుంటారు. ఇలా గతంలో చాలా సార్లు జరిగింది. కోచ్లు సబ్స్టిట్యూట్ ఫీల్డర్లుగా ఆడారు. కొన్ని సందర్భాల్లో ఫీల్డింగ్ కూడా చేశారు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ (5/72), ఆర్ అశ్విన్ (4/51) ధాటికి 218 పరుగులకే కుప్పకూలింది. జాక్ క్రాలీ (79; 108 బంతుల్లో 11×4, 1×6) పోరాడాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 30 ఓవర్లలో 135/1తో మొదటి రోజు ఆట ముగించింది. యశస్వి జైస్వాల్ (57; 58 బంతుల్లో 5×4, 3×6) హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ (52; 83 బంతుల్లో 6×4, 2×6)తో పాటు శుభ్మన్ గిల్ (26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
తాజావార్తలు
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
-
Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
-
Harry Brook: వరల్డ్ నంబర్వన్ భారత్పై రెండు సిరీస్లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
-
Honor X7e Plus 5G: హానర్ X7e ప్లస్ 5G రిలీజ్.. 8100mAh బ్యాటరీ, Snapdragon 4 Gen 4 చిప్, 50MP కెమెరా
-
Jantar Mantar Protest: జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!