IND vs ENG 4th Test: ఆదుకున్న గిల్, ధ్రువ్.. నాలుగో టెస్టులో భారత్ విజయం! సిరీస్ కైవసం
Dhruv Jurel, Shubman Gill star in IND vs ENG 4th Test: రాంచీ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనను 104.5 ఓవర్లలో ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. కష్టాల్లో పడిన భారత జట్టును యువ ఆటుగాళ్లు శుభ్మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39) చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. చివరి టెస్ట్ ధర్మశాలలో మార్చి 7 నుంచి ఆరంభం కానుంది.
ఓవర్ నైట్ స్కోర్ 40/0తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ జట్టు అనూహ్యంగా తడబడింది. అందరూ ఊహించినట్లే నాలుగో రోజు బంతి టర్న్ కావడంతో.. షోయబ్ బషీర్, టామ్ హార్ట్లీలు చెలరేగారు. ఈ ఇద్దరి ధాటికి భారత్ 16 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 84 పరుగుల వద్ద యశస్వీ జైస్వాల్ (37) ఔట్ కాగా.. హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ (55) హార్ట్లీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ (0) డకౌట్ కావడంతో 100 పరుగులకే మూడు కీలక వికెట్స్ కోల్పోయింది. ఈ దశమలో రవీంద్ర జడేజా (4), గిల్లు నాలుగో వికెట్కు 71 బంతుల్లో 20 రన్స్ చేశారు. దాంతో 118/3తో భారత జట్టు లంచ్కు వెవెళ్ళింది.
Also Read
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
Also Read: Sara Arjun: హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఐశ్వర్య రాయ్!
లంచ్ తర్వాత భారత్కు డబుల్ షాక్ తగిలింది. షోయబ్ బషీర్ బౌలింగ్లో రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్ ఖాన్ (0) ఔట్ అయ్యారు. 120 పరుగులకే 5 వికెట్స్ కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ ఇద్దరు స్పిన్నర్లతో అటాక్ చేయించాడు. దాంతో బౌండరీలు రావడమే గగనమైంది. గిల్, ధ్రువ్ సింగిల్స్, డబుల్స్తో స్ట్రైక్ రొటేట్ చేశారు. ఏంటో ఓపికగా ఆడిన గిల్.. రెండు సిక్సర్లతో ఫిఫ్టీ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో జట్టును ఒడ్డున పడేసిన ధ్రువ్.. రెండో ఇన్నింగ్స్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు అద్భుత బ్యాటింగ్ తో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.
స్కోర్లు:
ఇంగ్లండ్ – 353 ,145
ఇండియా- 307, 192/5
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్..
-
NDMA: మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకంటే?
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!