IND vs ENG: నేడు ఇంగ్లండ్తో రెండో టెస్టు.. భారత్ బోణీ కొట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ మరో టెస్టుకు సిద్ధమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఓటమితో ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారత్.. అచ్చొచ్చిన మైదానంలో విజయం సాధించాలని చూస్తోంది. బజ్బాల్ ఆటతో సిరీస్లో శుభారంభం చేసిన ఇంగ్లండ్.. ఆధిక్యం పెంచుకోవాలని చూస్తోంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో మరోసారి రసవత్తర పోరు సాగే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుండగా.. 9 గంటలకు టాస్ పడుతుంది.
రెండో టెస్టులో గెలవాలంటే భారత బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉంది. గత మ్యాచ్లో రాణించిన రవీంద్ర జడేజా, లోకేష్ రాహుల్ లేకపోవడం దెబ్బే. తుది జట్టులోకి వచ్చేందుకు రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య గట్టిపోటీ ఉంది. ఈ ఇద్దరు నెట్స్లో చెమటోడ్చారు. వీళ్లలో ఒకరు టెస్టు అరంగేట్రం చేయడం ఖాయం. విరాట్ స్థానంలో తొలి టెస్టుకు ముందే జట్టులోకి వచ్చిన రజత్కే అవకాశం దక్కేలా ఉంది. జడేజా స్థానంలో కుల్దీప్, సుందర్ రేసులో ఉన్నారు. స్పెషలిస్టు స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్నే ఆడించొచ్చు. ఆలా కాకుండా బ్యాటింగ్ పటిష్టం కావాలంటే సుందర్ను తీసుకోవచ్చు. ఈ టెస్టులో భారత్ ఒకే పేసర్ను ఆడించాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. శుభ్మన్, శ్రేయస్ఎం భరత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. ఫేవరేట్ మైదానంలో కెప్టెన్ రోహిత్ చెలరేగాలి అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ఇంగ్లండ్ తరఫున షోయబ్ బషీర్ అరంగేట్రం చేయనున్నాడు. హార్ట్లీ, రెహాన్లకు అతడు తోడు కానున్నాడు. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో జట్టుకు దూరమయిన విషయం తెలిసిందే. భారత్ బ్యాటర్లు వీరితో జాగ్రత్తగా ఉండాల్సిందే. మరోవైపు ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగానే ఉంది. ఇదే వేదికపై భారత్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ టాస్ గెలిచి విజయం సాధించింది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Jharkhand CM: నేడు ఝార్ఖండ్ సీఎంగా చంపయీ సోరెన్ ప్రమాణస్వీకారం.. 10 రోజుల్లో బలపరీక్ష!
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), యశస్వి, శుభ్మన్, శ్రేయస్, రజత్/సర్ఫరాజ్, కేఎస్ భరత్, అక్షర్, అశ్విన్, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్/సిరాజ్, బుమ్రా.
ఇంగ్లండ్: క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్స్టో, స్టోక్స్ (కెప్టెన్), ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, హార్ట్లీ, షోయబ్ బషీర్, అండర్సన్.
తాజావార్తలు
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!