IND vs ENG: విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్.. అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటు: రోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Breaks Silence On Virat Kohli’s Replacement in INS vs ENG Test: విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్ అని, అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటే అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గేమ్ను విరాట్ మరో లెవల్కి తీసుకెళ్లాడని, గత కొన్నేళ్ళుగా భారత జట్టుకు ఆడుతూ ఎన్నో రికార్డులు సాధించాడన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో జరిగే మొదటి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. విరాట్ స్థానంలో ఆర్సీబీ ఆటగాడు రజత్ పటీదార్కు అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం బీసీసీఐ నిర్వహించిన అవార్డుల కార్యక్రమానికి పటీదార్ హాజరవడంతో అతడినే ఎంపిక చేశామని బీసీసీఐ చెప్పకనే చెప్పింది.
ఇంగ్లండ్తో మొదటి టెస్ట్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. గేమ్ను అతడు మరో లెవల్కి తీసుకెళ్లాడు. గత కొన్నేళ్లుగా విరాట్ టీమిండియాకు ఆడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించాడు. విరాట్ దూరం అవ్వడం జట్టుకు లోటే. జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్లను పరిగణిస్తాం. ఆలా అని సీనియర్లకు కూడా తలుపులు ముసుకు పోలేదు’ అని చెప్పాడు. ‘కోహ్లీ స్థానంలో ముందుగా టీమ్ మేనేజ్మెంట్ సీనియర్లను తీసుకోవాలనుకుంది. చివరకు యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని జట్టు నిర్ణయించింది’ అని రోహిత్ తెలిపాడు.
Also Read
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
‘ఇంగ్లండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో రాణిస్తాం. అద్భుతమైన ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకుంటాం. రెండు మాసాలుగా మా ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంగ్లండ్ జట్టులో బలమైన ప్లేయర్స్ ఉన్నారు. ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. పక్కా వ్యూహంతో ఉప్పల్ మైదానంలోకి దిగుతాం. టెస్ట్ సిరీస్లో అనేక మార్పులు సంతరించుకున్నాయి. 20 ఏళ్ల క్రితం టెస్ట్ మ్యాచ్లకి.. ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లకు చాలా వ్యత్యాసం ఉంది’ అని రోహిత్ పేర్కొన్నాడు. ‘మూడో స్పిన్నర్గా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లలో ఎవరిని ఆడించాలన్నది తల నొప్పే. పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని ఆడించాలనేది నిర్ణయిస్తాం. మొహమ్మద్ సిరాజ్ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. మా జట్టులో అతడు ఒక కీలక బౌలర్’ అని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!