IND v ENG: భారత్కు అచ్చొచ్చిన ఉప్పల్ మైదానం.. అశ్విన్కు తిరుగేలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Uppal Stadium Records: ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై సంప్రదాయ పిచ్లపై ఎదురులేని భారత్.. బాజ్బాల్ ఆటతో హోరెత్తిస్తున్న ఇంగ్లండ్ మధ్య టెస్టు పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు వేదికైన ఉప్పల్ స్టేడియం పిచ్పై అందరి దృష్టి నెలకొంది. ఉప్పల్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందా? లేదా బౌన్స్తో కూడిన పేస్కు సహకరిస్తుందా? అన్న చర్చ మొదలైంది. అయితే ఉప్పల్ మైదానంలో భారత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది.
టెస్టుల్లో భారత్కు కలిసొచ్చిన వేదికల్లో ఉప్పల్ కూడా ఒకటి. ఉప్పల్ స్టేడియంలో ఐదు టెస్టులాడిన భారత్.. నాలుగింట్లో గెలుపొందింది. 2010లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. ఆపై న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్లపై గెలిచింది. ఉప్పల్లో వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్కు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ నాలుగు మ్యాచ్లాడిన అశ్విన్.. మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. యాష్ ఆడిన అన్నింట్లోనూ భారత్ గెలవడం విశేషం. ఇక్కడ రవీంద్ర జడేజా (15), ఉమేశ్ యాదవ్ (15) కూడా రాణించారు. మాజీలు ప్రజ్ఞాన్ ఓజా (9), హర్భజన్సింగ్ (7) కూడా వికెట్స్ పడగొట్టారు.
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
Also Read: IND vs ENG: కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడు.. కేఎస్ భరత్కు లైన్ క్లియర్!
ఉప్పల్లో తొలిసారిగా 2010 నవంబర్ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు జరిగింది. ఆ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. హర్భజన్ సింగ్ (111 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్స్లు) అజేయ సెంచరీ చేశాడు. 2012 ఆగస్టు 23 నుంచి 26 వరకు న్యూజిలాండ్తో భారత జట్టు రెండో టెస్టు ఆడింది. ఆర్ అశ్విన్ 12 వికెట్లు తీయడంతో భారత జట్టు ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో గెలిచింది. 2013 మార్చి 2 నుంచి 5 వరకు భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. చతేశ్వర్ పుజారా (204) డబుల్ సెంచరీ చేశాడు. 2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్ వేదికపై నాలుగో టెస్టు జరిగింది. విరాట్ కోహ్లీ (204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీతో భారత్ విజయం సాధించింది. 2018లో ఉప్పల్లో చివరిసారిగా వెస్టిండీస్తో భారత్ టెస్టు ఆడింది. ఈ మ్యాచ్లో భారత్ 10 వికెట్లతో ఘనవిజయం నమోదు చేసింది.
తాజావార్తలు
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!