IND vs BAN: బుమ్రా ఔట్.. అక్షర్ డౌటే! బంగ్లాతో రెండో టెస్టులో ఆడే భారత తుది జట్టు ఇదే
- బంగ్లాదేశ్తో రెండో టెస్టు
- సిరీస్ క్లీన్స్వీప్పై భారత్ కన్ను
- బుమ్రా ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing 11 vs BAN For 2nd Test: బంగ్లాదేశ్తో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాను ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అదే ఊపులో కాన్పూర్ వేదికగా శుక్రవారం ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తోంది. అంతేకాదు సిరీస్ను 2-0తో కైవసం చేసుకుని డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంతో రెడీ అవుతోంది. కాన్పూర్ పిచ్ స్పిన్కు సహకరిస్తుందన్న వార్తల నేపథ్యంలో భారత తుది జట్టులో మార్పు జరిగే అవకాశం ఉంది.
సాధారణంగా కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. అందుకే భారత్ ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పెసలిస్ట్ స్పిన్నర్లు ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆడటం ఖాయం. మూడో స్పిన్నర్ ఎవరా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారా? లేదా బ్యాటింగ్ బలోపేతం కోసం అక్షర్ పటేల్ను తీసుకుంటారా? అనేది చూడాలి. కుల్దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Also Read
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
- Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
ఎక్స్ట్రా స్పిన్నర్ రాకతో ఒక పేసర్ బెంచ్కు పరిమితం కానున్నాడు. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారని తెలుస్తోంది. దాంతో మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ తుది జట్టులో కొనసాగనున్నారు. బ్యాటింగ్ విభాగంలో మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నారు. గిల్, కోహ్లీ, పంత్, రాహుల్లు వరుసగా బ్యాటింగ్ చేయనున్నారు. మొదటి టెస్టులో గిల్, పంత్, అశ్విన్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.
Also Read: Samsung Galaxy M15 5G Price: 10 వేలకే శాంసంగ్ 5జీ ఫోన్.. సూపర్ కెమెరా, బిగ్ బ్యాటరీ!
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
తాజావార్తలు
-
NTRNeel :’డ్రాగన్’ గ్లిమ్స్ అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందుగానే
-
Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
-
IPL 2026 playoff scenarios: నేడు కీలక మ్యాచ్.. సీఎస్కే-ఎస్ఆర్హెచ్ పోరుతో మారనున్న ప్లేఆఫ్స్ సమీకరణాలు!
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..