Rohit Sharma: బంగ్లాదేశ్తో రెండో టెస్టు.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం!
- బంగ్లాదేశ్తో రెండో టెస్టు
- రోహిత్ సంచలన నిర్ణయం
- ఇది రెండోసారి మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Selected Field after 9 Years in Tests in India: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారత గడ్డపై జరిగే మ్యాచుల్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్లు బౌలింగ్ను తీసుకోవడం చాలా అరుదు. కానీ రోహిత్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చివరిసారిగా 2015లో అప్పటి సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
స్వదేశంలో టెస్ట్ మ్యాచ్లలో భారత కెప్టెన్లు టాస్ గెలిస్తే.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటారు. భారత్లోని పరిస్థితులే ఇందుకు కారణం. తొలి ఇన్నింగ్స్లో ఎక్కువగా పరుగులు చేసి.. పర్యాటక జట్టుపై ఒత్తిడిని తెస్తారు. అంతేకాదు మూడో రోజు నుంచి బంతి ఎక్కువగా టర్న్ అవుతుందని తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటారు. భారత్లో నాలుగో ఇన్నింగ్స్ అత్యంత ప్రమాదకరం. ఛేదన చాలా కష్టం. గణాంకాలు కూడా ఇదే చెబుతాయి. అందుకే టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంటారు. కానీ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
Also Read: IPL 2025: రిటైర్మెంట్ ప్రకటించిన గంటల్లోనే మెంటార్గా బాధ్యతలు.. గంభీర్ పోస్ట్ కొట్టేశాడు!
కాన్పూర్లో 24 టెస్టులు జరగగా.. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 1964లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో అప్పటి కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సాధారణంగా కాన్పూర్ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. అయితే గురువారం రాత్రి వర్షం పడటం, నేడు వాతావరణం మేఘావృతమై ఉండటంతో రోహిత్ శర్మ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా మైదానం తడిగా ఉండటతో ఆ పరిస్థితులను ఉపయోగించుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!