IND vs AUS: విరాట్ అవసరమా?.. సునీల్ గవాస్కర్ ఫైర్!
- నిరాశ పర్చుతున్న విరాట్ కోహ్లీ
- బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో మూడోసారి
- సునీల్ గవాస్కర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాపై మంచి రికార్డు కలిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈసారి మాత్రం నిరాశ పర్చుతున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు భారీ స్కోరు సాధించిన పిచ్పై సీనియర్ అయిన విరాట్.. తన బలహీనతతో ఔట్ కావడం అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో జోష్ హేజిల్వుడ్ వేసిన ఆఫ్సైడ్ బంతిని ఆడి మరీ వికెట్ కీపర్కు దొరికిపోయాడు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇలా ఔట్ కావడం మూడోసారి. దీంతో కోహ్లీపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విరాట్.. ఆ బంతి ఆడటం అవసరమా? అని ప్రశ్నించారు.
ఛానెల్ 7లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘యశస్వి జైస్వాల్ అత్యుత్తమ షాట్ ఆడలేదు. భారత్ ముందు 445 పరుగులు ఉన్నాయి. ఈ సమయంలో బ్యాటర్ దృష్టి పరుగులపై మాత్రమే ఉండాలి. బంతిని దూరంగా ఫ్లిక్ చేయడానికి యశస్వి ప్రయత్నించాడు. ఇది ఒక సాధారణ క్యాచ్. మంచి ఫీల్డింగ్ ప్లేసింగ్, పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ చాలా బాగుంది. ఇక విరాట్ కోహ్లీకి ఆ బంతిని ఆడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాలుగో స్టంప్ మీద బంతిని విసిరితే ఆడేందుకు ప్రయత్నిస్తే ఓకే. కానీ ఇక్కడ బంతి మరీ దూరంగా వెళ్తోంది. ఆ బంతిని ఆడాల్సిన అవసరమే లేదు. కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. కాస్త ఓర్పు ప్రదర్శించి ఉంటే.. కేఎల్ రాహుల్తో కలిసి క్రీజ్లో ఉండేవాడు. విరాట్ పేలవ షాట్తో అభిమానులను షాక్కు గురి చేశాడు’ అని అన్నారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Also Read: IND vs AUS: దిమాక్ ఉందా?.. ఆకాశ్ దీప్పై రోహిత్ శర్మ ఆగ్రహం!
మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (4), శుభ్మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషబ్ పంత్ (9) నిరాశపర్చారు. కేఎల్ రాహుల్ (33), రోహిత్ శర్మ (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్కు భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!