Samosa: సమోసాల్లో కండోమ్లు, గుట్కాలు.. అవి తిన్న వారికి..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణేలోని ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటీన్ లో వడ్డించే సమోసాలలో కండోమ్లు, గుట్కా, రాళ్లు లభ్యమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలోని పింప్రి-చించ్వాడ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు రహీం షేక్, అజర్ షేక్, మసర్ షేక్, ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. క్యాటలిస్ట్ సర్వీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆటోమొబైల్ సంస్థ క్యాంటీన్ కు స్నాక్స్ ను సరఫరా చేస్తోంది. అయితే తాజాగా సమోసాల సరఫరా కాంట్రాక్టును మనోహర్ ఎంటర్ ప్రైజెస్ అనే మరో సబ్ కాంట్రాక్టు సంస్థకు కేటలిస్ట్ కంపెనీ అప్పగించింది. ఈ సబ్ కాంట్రాక్టు సంస్థ సరఫరా చేసిన సమోసాల్లో కండోమ్స్, గుట్కా, రాళ్లు లభ్యమయ్యాయి. దీంతో ఆటోమొబైల్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: Unstoppable 4: బాలయ్య మళ్లీ వస్తున్నాడు గెట్ రెడీ
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
విచారణలో మనోహర్ ఎంటర్ప్రైజెస్ లో పనిచేస్తున్న ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ లు సమోసాలలో కండోమ్లు, గుట్కా, రాళ్లు నింపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు వారిని ప్రశ్నించారు. మనోహర్ ఎంటర్ప్రైజెస్ పరువు తీసేందుకే అలా చేశామని నిందితులు అంగీకరించారు. నిందితులు ఎస్ఆర్ఎ ఎంటర్ప్రైజెస్ అనే మరో కంపెనీ ఉద్యోగులని, గతంలో కాంట్రాక్టు పద్ధతిలో చిరుతిళ్లను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆహారంలో కల్తీ చేసిన వారిపై, అలా నియమించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Also Read: Unstoppable 4: బాలయ్య మళ్లీ వస్తున్నాడు గెట్ రెడీ
ఇకపోతే సదరు సమోసాలు తిని అస్వస్థతకు గురైన ఆ కంపెనీ ఉద్యోగులను వారి యాజమాన్యం ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పించింది. ఇకపోతే, ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలియడంతో అంతా ఊపిరి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విషయం వైరల్ కావడంతో.. ఇలా తినే తిండి పదార్థాలలో అలాంటి వస్తువులు పెట్టడం ఏంటని సోషల్ మీడియాలో తెగ విమర్శలు వస్తున్నాయి. చూడాలిమరి ఈ విషయంపై అక్కడి అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో.
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!