MS Dhoni: అయ్యబాబోయ్.. ధోని ఓ రేంజ్ లో అభిమానులను ప్రాంక్ చేసేసాడుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు గురించి ప్రపంచంకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారత్ లో ఈ పెరంటే క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లో ధోనిని చూసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడి స్టేడియాలకు క్రికెట్ లవర్స్ ఎగబడి పోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు ధోని ఆడే చివరి సిరీస్ ఇది అన్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి. పెద్ద ఎత్తున మహేంద్ర సింగ్ ధోని అభిమానులు స్టేడియం కు వచ్చి అతనిని సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా జరిగిన మ్యాచ్ లో చెన్నై వేదికగా కోల్కత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ విషయం స్పష్టంగా కనపడింది. అయితే ఈ విషయంలో ధోని కాస్త డిఫరెంట్ గా ఆలోచించి వచ్చిన ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యేలా ఓ ప్రాంక్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోమవారం నాడు జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాకపోతే మ్యాచ్ చివరి లో 17 ఓవర్ లో చెన్నై సూపర్ కింగ్స్ శివం దుబే వికెట్ కోల్పోయింది. వికెట్ పడిపోవడంతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. దానికి కారణం మహేంద్రసింగ్ ధోని. ధోని నినాదాలతో గ్రౌండ్ మార్మోగింది. కాకపోతే డ్రెస్సింగ్ రూమ్ నుండి ముందుగా రవీంద్ర బయటకు వచ్చి బ్యాటింగ్ వెళ్లేలా కనిపించాడు. దాంతో అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. కాకపోతే అప్పుడే అసలైన ట్విస్ట్ మొదలయింది. ఆ సమయంలో జడేజా బ్యాటింగ్ కు వస్తున్నట్టే వచ్చి మళ్లీ యుటర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. దాంతో ఆ సమయంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు అసలు ఏం జరుగుతుందోన్న సంగతి అర్థం అవలేదు. మరో క్షణంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న మహేందర్ సింగ్ ధోని హెల్మెట్ పెట్టుకుని బ్యాట్ తీసుకోని డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఇకఅంతే.. ధోని అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దాంతో మరోసారి స్టేడియం మొత్తం ధోని నినాదాలతో మారు మోగింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కాకపోతే ఈ విషయంపై మొదట జడేజా ప్రాంక్ చేశాడని అందరూ భావించిన.. కానీ., అది ధోని ప్లాన్ అని స్వయంగా జడ్జి అని తెలిపారు. చెపాక్ స్టేడియంలో ప్రేక్షకులకు జలక్ ఇవ్వాలని ధోని అనుకున్నట్లు అందులో భాగంగా వారికి పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ లభించడానికి ధోని ఇలా భావించాడని రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు.
Ravindra Jadeja teased the Chepauk crowd by coming ahead of MS Dhoni then going back. 🤣
– This is amazing!! ❤️👌 pic.twitter.com/KPp4FewM17
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2024
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!