Hyderabad Metro: రాబోయే నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ పూర్తి?
- హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్.
- సిటీ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ.
- రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే మెట్రో రెండో దశ.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది. సిటీ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ పెరగటంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు సంబంధించిన డీపీఆర్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే పనులు మొదలు పెట్టి రాబోయే నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు విజయవంతంగా సేవలందిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రూ.22,000 కోట్లతో నిర్మించారు.
Kiran Abbavaram : తమిళ్ లో మా సినిమాకు థియేటర్స్ ఇవ్వలేదు..
Also Read
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
- AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం రోజుకు దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. రెండో దశ అందుబాటులోకి వస్తే సిటీలో రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తారు. మెట్రో రైల్ మొదటి దశ అమలైనప్పుడు హైదరాబాద్ దేశంలోనే ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో నిలిచింది. గత ప్రభుత్వం ఏడేండ్లుగా మెట్రో విస్తరణను పట్టించుకోలేదు. ఈలోపు మిగిలిన నగరాలన్నీ రెండో, మూడో దశ నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశాయి. గత ప్రభుత్వం నిర్వాకంతో ఒకప్పుడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు దేశంలో 9వ స్థానానికి పడిపోయింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా వంటి పెద్ద నగరాలతో పాటు, పూణే, నాగపూర్, అహ్మదాబాద్ చిన్న నగరాలు కూడా మెట్రో విస్తరణలో హైదరాబాద్ ని అధిగమించాయి.
Minister Ramprasad Reddy: కడప-హైదరాబాద్ ఇండిగో కనెక్టింగ్ విమాన సర్వీసును ప్రారంభించిన మంత్రి
గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఏడేండ్లు ఆలస్యం చేయటంతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచే కొత్త ప్రభుత్వం మెట్రో విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మార్గాలతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రెండవ దశలో అయిదు కారిడార్లలో 76.4 కిలో మీటర్ల మేరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబందించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పూర్తయింది. ఇందులో ప్రస్తుతం మూడు కారిడార్లు ఉన్నాయి. రెండో దశ లో ప్రతిపాదించిన కొత్త 5 కారిడార్ల వివరాలు చూస్తే..
* నాలుగో కారిడార్ నాగోల్– శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు (36.8 కి.మీ)
* అయిదో కారిడార్ రాయదుర్గ్–కోకాపేట్ నియోపొలిస్ వరకు (11.6 కి.మీ)
* ఆరో కారిడార్ ఎంజీబీఎస్–చంద్రాయన్ గుట్ట వరకు (7.5 కి.మీ)
* ఏడో కారిడార్ మియాపూర్–పటాన్చెరు వరకు (13.4 కి.మీ)
* ఎనిమిదో కారిడార్ ఎల్ బీ నగర్–హయత్ నగర్ వరకు (7.1 కి.మీ.)
ఈ మెట్రో రెండవ దశను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు పీపీపీ విధానంలో చేపడుతాయి. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.24269 కోట్లు. అందులో 30 శాతం అంటే రూ.7313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం అంటే రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. మిగతా 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకుంటాయి.
తాజావార్తలు
-
US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!