Rape Case: ఇన్స్టాగ్రామ్లో స్నేహం.. ఆపై కామానికి బలైన బాలిక..
- కర్ణాటకలోని ఉడిపిలో దారుణ ఘటన.
- బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.
- పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rape Case: కర్ణాటకలోని ఉడిపిలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆపై నిందితుడికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉడిపిలోని కర్కాలలో జరిగింది. ఇకపోతే బాధిత బాలికను ఇన్స్టాగ్రామ్ ద్వారా అల్తాఫ్ అనే యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తనను కలవాలని అల్తాఫ్ ఆ అమ్మాయిని పిలిచాడు. అనంతరం ఆ బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Rohith Sharma: రోహిత్ శర్మ కోసం రూ.50 కోట్లైన ఇవ్వడానికి రెడీగా ఉన్న ఆ ఫ్రాంఛైజీలు..?
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
నేరం చేసిన తర్వాత నిందితుడు అల్తాఫ్ బాలికను ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు వెళ్తున్నాడు. అదే సమయంలో స్థానిక హిందూ కార్యకర్తలు కారును ఆపారు. కారులో ఉన్న బాలిక మద్యం మత్తులో ఉండడం గ్రహించారు. దీంతో ఆగ్రహించిన హిందూ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికను ఆస్పత్రిలో చేర్చగా.. అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీని తరువాత, హిందూ కార్యకర్తలు పోలీసు స్టేషన్ బయట గుమిగూడి ఈ విషయంలో చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు.
కార్యకర్తల నిరసన అనంతరం బాధితురాలి తల్లిదండ్రుల వాంగ్మూలం మేరకు పోలీసులు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. అల్తాఫ్ తన ఇద్దరు స్నేహితుల సాయంతో బాలికకు మత్తు మందు ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు బాలికను ఆమె ఇంటి దగ్గర దింపేందుకు వెళ్లాడు. ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్తాఫ్ అత్యాచారానికి పాల్పడ్డాడని, బీర్ బాటిల్, డ్రగ్స్ తీసుకురావడానికి మరో ఇద్దరు వ్యక్తులు సహకరించారని సమాచారం. అయితే, వారు అత్యాచారానికి పాల్పడలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారిస్తారు.
తాజావార్తలు
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!