Rape Case: ఇన్స్టాగ్రామ్లో స్నేహం.. ఆపై కామానికి బలైన బాలిక..
- కర్ణాటకలోని ఉడిపిలో దారుణ ఘటన.
- బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.
- పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rape Case: కర్ణాటకలోని ఉడిపిలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆపై నిందితుడికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉడిపిలోని కర్కాలలో జరిగింది. ఇకపోతే బాధిత బాలికను ఇన్స్టాగ్రామ్ ద్వారా అల్తాఫ్ అనే యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తనను కలవాలని అల్తాఫ్ ఆ అమ్మాయిని పిలిచాడు. అనంతరం ఆ బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Rohith Sharma: రోహిత్ శర్మ కోసం రూ.50 కోట్లైన ఇవ్వడానికి రెడీగా ఉన్న ఆ ఫ్రాంఛైజీలు..?
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
నేరం చేసిన తర్వాత నిందితుడు అల్తాఫ్ బాలికను ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు వెళ్తున్నాడు. అదే సమయంలో స్థానిక హిందూ కార్యకర్తలు కారును ఆపారు. కారులో ఉన్న బాలిక మద్యం మత్తులో ఉండడం గ్రహించారు. దీంతో ఆగ్రహించిన హిందూ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికను ఆస్పత్రిలో చేర్చగా.. అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీని తరువాత, హిందూ కార్యకర్తలు పోలీసు స్టేషన్ బయట గుమిగూడి ఈ విషయంలో చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు.
కార్యకర్తల నిరసన అనంతరం బాధితురాలి తల్లిదండ్రుల వాంగ్మూలం మేరకు పోలీసులు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. అల్తాఫ్ తన ఇద్దరు స్నేహితుల సాయంతో బాలికకు మత్తు మందు ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు బాలికను ఆమె ఇంటి దగ్గర దింపేందుకు వెళ్లాడు. ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్తాఫ్ అత్యాచారానికి పాల్పడ్డాడని, బీర్ బాటిల్, డ్రగ్స్ తీసుకురావడానికి మరో ఇద్దరు వ్యక్తులు సహకరించారని సమాచారం. అయితే, వారు అత్యాచారానికి పాల్పడలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారిస్తారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?