Rape Case: ఇన్స్టాగ్రామ్లో స్నేహం.. ఆపై కామానికి బలైన బాలిక..
- కర్ణాటకలోని ఉడిపిలో దారుణ ఘటన.
- బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.
- పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rape Case: కర్ణాటకలోని ఉడిపిలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆపై నిందితుడికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉడిపిలోని కర్కాలలో జరిగింది. ఇకపోతే బాధిత బాలికను ఇన్స్టాగ్రామ్ ద్వారా అల్తాఫ్ అనే యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తనను కలవాలని అల్తాఫ్ ఆ అమ్మాయిని పిలిచాడు. అనంతరం ఆ బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Rohith Sharma: రోహిత్ శర్మ కోసం రూ.50 కోట్లైన ఇవ్వడానికి రెడీగా ఉన్న ఆ ఫ్రాంఛైజీలు..?
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
నేరం చేసిన తర్వాత నిందితుడు అల్తాఫ్ బాలికను ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు వెళ్తున్నాడు. అదే సమయంలో స్థానిక హిందూ కార్యకర్తలు కారును ఆపారు. కారులో ఉన్న బాలిక మద్యం మత్తులో ఉండడం గ్రహించారు. దీంతో ఆగ్రహించిన హిందూ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికను ఆస్పత్రిలో చేర్చగా.. అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీని తరువాత, హిందూ కార్యకర్తలు పోలీసు స్టేషన్ బయట గుమిగూడి ఈ విషయంలో చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు.
కార్యకర్తల నిరసన అనంతరం బాధితురాలి తల్లిదండ్రుల వాంగ్మూలం మేరకు పోలీసులు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. అల్తాఫ్ తన ఇద్దరు స్నేహితుల సాయంతో బాలికకు మత్తు మందు ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు బాలికను ఆమె ఇంటి దగ్గర దింపేందుకు వెళ్లాడు. ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్తాఫ్ అత్యాచారానికి పాల్పడ్డాడని, బీర్ బాటిల్, డ్రగ్స్ తీసుకురావడానికి మరో ఇద్దరు వ్యక్తులు సహకరించారని సమాచారం. అయితే, వారు అత్యాచారానికి పాల్పడలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారిస్తారు.
తాజావార్తలు
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!