Fake Currency Gang: నకిలీ నోట్ల ముఠాను పట్టించిన ఏటీఎం..!
- కోనసీమ జిల్లాలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు..
- 12 మంది నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Currency Gang: కోనసీమ జిల్లాలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. 12 మంది నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన షేక్ మస్తాన్.. హనుమాన్ జంక్షన్కు సమీపంలోని వీరవల్లి గ్రామంలో NMS ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థ నడుపుతున్నాడు. అయితే, దొంగనోట్లను ముద్రించాలని నిర్ణయించుకున్నాడు. కంప్యూటర్, స్కానర్, కలర్ పింటర్, జిరాక్స్ మిషన్లను సమకూర్చుకున్నాడు. అసలు ఏదో..? నకిలీ ఏదో..? గుర్తించలేని రీతిలో ఐదొందల రూపాయల నోట్లను ముద్రించడం ప్రారంభించాడు. రాజోలు మండలం తాటిపాక మఠంకు చెందిన పాస్టర్ కోళ్ళ వీర వెంకట సత్యనారాయణ, అనపర్తికి చెందిన సత్తి వీరరాఘవ రెడ్డిని ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వాళ్ల సాయంతో నకిలీ నోట్లను చలామణీ చేయడం ప్రారంభించాడు.
Read Also: TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు.. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణ..
Also Read
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
అయితే, ఇటీవల షేక్ మస్తాన్ ఇచ్చిన 50 వేల రూపాయల నకిలీ 500 రూపాయల నోట్లను యాక్సిస్ బ్యాంక్ ATMలో డిపాజిట్ చేశాడు సత్యనారాయణ. అయితే, వాటిని నకిలీ నోట్లుగా గుర్తించిన ATM… బ్యాంక్ అధికారులకు అలర్ట్ పంపింది. మరోవైపు… తాను డిపాజిట్ చేసిన 50 వేల రూపాయలు అకౌంట్లో జమ కాలేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు సత్యనారాయణ. ఓ వైపు ATM నుంచి అలెర్ట్ రావడం… ఆ డబ్బు తనదేనంటూ సత్యనారాయణ బ్యాంకు రావడంతో అధికారుల పని సులువైపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్యనారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో దొంగ నోట్ల దందా బట్టబయలైంది. ఇక ఈ వ్యవహారంలో సత్యనారాయణ, అనపర్తికి చెందిన సత్తి వీర రాఘవ రెడ్డి, షేక్ మస్తాన్తో పాటు మొత్తం 12 మంది అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులంతా ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాకు చెందిన వాళ్లే. అలాగే, పరారీలో ఉన్న ఇంకొందరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది. దొంగ నోట్ల ముద్రణ కోసం ఉపయోగించిన పరికరాలను సీజ్ చేశారు పోలీసులు. అలాగే, చెలామణికి సిద్ధం చేసిన లక్షా 33 వేల రూపాయలు విలువ చేసే నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!