NCB: పాన్-ఇండియా డ్రగ్ నెట్వర్క్ను ఛేదించిన ఎన్సీబీ.. వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCB: డార్క్నెట్, క్రిప్టోకరెన్సీని ఉపయోగించిన పాన్-ఇండియా డ్రగ్ నెట్వర్క్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. 15 వేల ఎల్ఎస్డీ బ్లాట్స్ను ఎన్సీబీ సీజ్ చేసింది. ఈ వ్యవహరంలో ఆరుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారి ఇద్దరు రష్యన్లు అని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. డార్క్ వెబ్ ద్వారా నిర్వహించబడుతున్న డ్రగ్ ట్రాఫికర్లలో పాన్-ఇండియా నెట్వర్క్ భాగమని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. గత రెండు దశాబ్దాలలో ఎన్సీబీ చేసిన అతిపెద్ద జప్తుల్లో ఇది ఒకటని జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు.ఫేక్ ఐడీలు, నకిలీ డాక్యుమెంట్స్, ఫారిన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.
Read Also: Odisha Train accident: ఒడిశా రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్తో మృతి..
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
నిందితుల నుంచి 2.5 కిలోల గంజాయి , రూ.4.65 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాలలో జమ చేసిన రూ. 20 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎల్ఎస్డీ లేదా లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ అనేది ఒక సింథటిక్ రసాయన ఆధారిత డ్రగ్, ఇది చాలా ప్రమాదకరమని ఆయన చెప్పారు. ఈ మాదకద్రవ్యాల నెట్వర్క్ పోలాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్తో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి కొన్ని భారతీయ రాష్ట్రాలలో విస్తరించి ఉందని చెప్పారు. ఈ డ్రగ్ను పోలాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ నుండి భారతదేశానికి దిగుమతి చేసుకునేవారు. డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ డార్క్నెట్లో యాక్టివ్గా ఉందని, క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపు జరిగిందని ఆయన చెప్పారు. ఎల్ఎస్డీ వాసన, రుచి లేనిదని, పుస్తకాల సహాయంతో రవాణా చేయడం వల్ల గుర్తించడం కష్టమని ఆయన అన్నారు. దేశంలో యువతలో ఈ డ్రగ్ బాగా ప్రాచుర్యం పొందిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్ నెట్వర్క్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది విద్యావంతులు, యువకులే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పారు.
Read Also: Pakistan: అప్పుల ఊబిలో పాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం
అన్ని లావాదేవీలు వర్చువల్గా ఉన్నాయని, అనుమానితులు కమ్యూనికేట్ చేయడానికి ప్రైవేట్ మెసేజింగ్ యాప్లను ఉపయోగించారని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు. ఎల్ఎస్డీ అక్రమ రవాణా చేయడం చాలా సులభం.. ట్రేస్ చేయడం దాదాపు కష్టమని ఆయన తెలిపారు. వాణిజ్య పరిమాణంలో 5 లేదా 6 బ్లాట్లు ఉంటాయని చెప్పారు. 2021 సంవత్సరంలో మొత్తం 5000 బ్లాట్లను ఎన్సీబీ జప్తు చేసిందన్నారు.ఢిల్లీ జోనల్ బృందం అనేక యూనిట్ల సహాయంతో కార్టెల్ను ఛేదించామని తెలిపారు. భారతదేశం నెమ్మదిగా ఎల్ఎస్డీ పెద్ద వినియోగదారుగా మారుతోంది..ఇది ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!