Odisha Train accident: ఒడిశా రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్తో మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ అనంతరం పలు విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుతోపాటు.. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు.. ఇంత ఘోర ప్రమాదం జరిగినప్పటికీ కొందరు ఎలా బ్రతికి బయటపడ్డారనే విషయాలు అధికారుల పరిశీలనలో వెలుగు చూస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 278 మంది మృతిచెందగా.. 1,100 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాదంలో మరణించిన వారిలో సుమారు 40 మంది వరకు విద్యుత్ షాక్తో మరణించినట్టు రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
Read also: Train Accident: ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్ రైలులో మంటలు
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
కోరమాండల్ ఎక్స్ప్రెస్ బోగీల్లో చిక్కుకున్న కనీసం 40 మృతదేహాలను వెలికితీయగా.. వాటిపై ఎటువంటి గాయాలు లేవని గుర్తించిన అధికారులు వారు విద్యుదాఘాతానికి గురై ఉంటారని భావిస్తున్నారు. తెగిపడిన ఓవర్ హెడ్ కేబుల్స్ ద్వారా షాక్కు గురై ఉంటారని .. లైవ్ ఓవర్హెడ్ కేబుల్స్ బోగీలపై పడటంతో వారి మరణాలకు విద్యుదాఘాతమే కారణమని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఓవర్ హెడ్ ఎల్టీ (తక్కువ తీవ్రత) లైన్తో తాకిడి.. తర్వాత విద్యుదాఘాతం కారణంగా చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) సబ్-ఇన్స్పెక్టర్ పాపు కుమార్ నాయక్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read also: Anupama Parameswaran: అందుకే అనుపమ అలాంటి పని చేస్తుందా?
చెన్నైకి వెళ్తోన్న కోరమాండల్ రైలు.. బహనాగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద లూప్లైన్లోకి వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు యశ్వంత్పూర్ (బెంగళూరు)-హౌరా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ బోగీలపైకి దూసుకెళ్లడంతో కేబుల్స్ తెగిపోయాయి. చాలా వరకూ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.. అందులో సుమారు 40 మృతదేహాలపై ఎటువంటి గాయాల గుర్తులు, రక్తస్రావం అయినట్టు కనిపించలేదని .. వారి మరణానికి విద్యాదాఘాతం కారణం కావచ్చని పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ పూర్ణ చంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ కేబుల్స్ రైలుపై పడి బోగీలలోని కొంత భాగాన్ని సెకనులో తాకే అవకాశం ఉందని, దీంతో విద్యుదాఘాతానికి గురై ఉంటారని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!