Biparjoy Cyclone: తీర ప్రాంతాలకు IMD రెడ్ అలర్ట్.. 37 వేల మంది తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిపర్ జోయ్ తుఫాను నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు బిపర్ జోయ్ తుఫాన్ హెచ్చరికలతో రెడ్ అలర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తుఫాన్ ఈశాన్య దిశగా ప్రయాణించి రేపు సాయంత్రానికి జాఖౌ పోర్టు సమీపంలో మాండ్వి, కరాచీ మధ్య సౌరాష్ట్ర, కచ్, దానిని ఆనుకుని ఉన్న పాకిస్తాన్ తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాజ్ కోట్ లో సురక్షితం కాదని ప్రకటించిన రిలే టవర్ ను బిపర్ జోయ్ తుఫాను కారణంగా కూల్చిశారు.
Also Read : CM KCR: మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా డాక్టర్ల ముందు చేయి చూపాల్సిందే
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
దీంతో బిపర్ జోయ్ తుఫాన్ పై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్ లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. మరోవైపు బిపర్జోయ్ తుఫాను నేపథ్యంలో పశ్చిమ రైల్వే గుజరాత్-ముంబయి మధ్య నడిచే పలు రైళ్లను క్యాన్సిల్ చేసింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో గురువారం సాయంత్రం జఖౌ సమీపంలో తుఫాన్ తీరం దాటనుంది.
Also Read : Tollywood top 10: టాలీవుడ్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 10 సినిమాలివే!
పలు ప్రభుత్వ సంస్థలు తీరప్రాంత జిల్లాలైన సౌరాష్ట్ర, కచ్ లలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోందని వెదర్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. గుజరాత్ లోని ఎనిమిది జిల్లాల్లో సముద్రం సమీపంలో నివసిస్తున్న దాదాపు 37,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం చెప్పింది. తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Also Read : Upasana konidela :పుట్టబోయే బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన?
అరేబియా సముద్రం, బలూచిస్థాన్ తీర ప్రాంతంలో బిపర్ జోయ్ తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాను ప్రభావం కొనసాగుతుండటం, మక్రాన్ బెల్ట్ సమీపిస్తుండటంతో బలూచిస్థాన్ ప్రభుత్వం ఆ ప్రావిన్స్ తీర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మీర్ అబ్దుల్ ఖుద్దూస్ బిజెంజో ఆదేశాల మేరకు తీర ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది.
#WATCH | Strong winds, high tide triggered by cyclone 'Biparjoy' at Mandvi beach in Kachchh district of Gujarat pic.twitter.com/0WkTkytW2N
— ANI (@ANI) June 14, 2023
తాజావార్తలు
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..