IIIT Student Suicide: ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
- ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
- సెల్ఫోన్ను దొంగిలించిందనే అభియోగంపై మందలించడంతో మనస్తాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIIT Student Suicide: సెల్ఫోన్ను దొంగిలించిందనే అభియోగంపై మందలించడంతో మనస్తాపానికి గురైన ట్రిపుల్ఐటీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వైఎస్సార్ జిల్లా ఇడుపాలపాయ ట్రిపుల్ ఐటీ మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన మక్బూల్,నసీమా దంపతులకు కుమారుడు సోహెల్ అబ్బాస్, కుమార్తె జమీషా ఖురేషీలు ఉన్నారు. జమీషా ఖురేషి(17)కి ఇడుపులపాయ క్యాంపస్లోని ఒంగోల్ ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. మొదటి సంవతసరం పీయూసీ-1లో మంచి మార్కులు సాధించింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది.
Read Also: Online Rummy : చెన్నైలో విషాదం నింపిన ఆన్ లైన్ రమ్మీ
Also Read
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం హాస్టల్లో ఓ విద్యార్థిని తన సెల్ఫోన్లో మరిచిపోయారు. తన ఫోన్ కనిపించడం లేదంటూ వార్డెన్కు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీని పరిశీలించగా.. ఆ ఫోన్ను జమీషా ఖురేషీ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ అధికారులు ఆమెను అందరి ముందు మందలించారు. జరిగిన విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో అవమానంగా భావించి మంగళవారం అర్ధరాత్రి హాస్టల్లోని స్నానాల దిలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఉన్న తోటి విద్యార్థులు రాత్రి స్టడీ అవర్స్కు వెళ్లడంతో ఎవరూ గుర్తించలేదు. 10 గంటల తర్వాత విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ కుమార్తె ఆరోగ్యం సరిగా లేదని ట్రిపుల్ ఐటీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి సమాచారం ఇచ్చారని.. తీరా అక్కడికి వెళ్తే ఆత్మహత్య చేసుకుందని ఖురేషి తల్లిదండ్రులు విలపించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!