Vikarabad: వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్.. కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద పరిస్థితులపై ఐజీ షనవాజ్ ఖాసీం ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వికారాబాద్ జిల్లాతో పాటు సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అదే విధంగా భద్రాద్రి, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, ఖమ్మం, సూర్యపేట, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. అయితే ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పాటు వరద పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Read Also: Vasireddy Padma: పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
దీంతో విద్యార్థులకు రేపు ( శుక్రవారం) తెలంగాణ వ్యాప్తంగా విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అయితే, వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సైతం జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు వారి మండలాల్లో ఉదృత్తంగా ప్రవహించే వాగుల దగ్గర కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్ల నుంచి ప్రజలను స్కూల్ లేదా, గ్రామ పంచాయతీ ఆఫీస్ ల్లోకి తరలించాలని తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవుల్లో ట్రెక్కింగ్ ను కూడా అధికారులు నిలిపి వేశారు.
Read Also: Vanama Venkateshwar Rao: వనమా వెంకటేశ్వర్ రావుకు హైకోర్టు మరోసారి షాక్
పర్మిషన్ లేకుండా అడవిలోకి ఎవరూ వెళ్లకూడదని అటవిశాఖ అధికారులు సూచించారు. జిల్లాలో ప్రతి వాగు ఉదృత్తంగా ప్రవహిస్తుంది. కాగా, వికారాబాద్ లోని మూసీనదితో పాటు కాగ్నానది, కోట్ పల్లి ప్రాజెక్ట్, సర్పన్ పల్లి, నంది వాగు ప్రాజెక్టుల నీరు అలుగు పారి ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్ రేంజ్ ఐజీ షనవాజ్ ఖాసీం, జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి కోట్ పల్లి ప్రాజెక్ట్ ను సందర్శించారు. ధారూర్ సమీపంలోని నాగ సముందర్ వద్ద రాక పోకలు నిలిచిపోవడంతో అక్కడి పరిస్థితులను ఆయన పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!