ICC Cricket World Cup: భారత్తో మ్యాచ్ అంటేనే పాకిస్తాన్ ప్లేయర్స్ వణికిపోతున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moin Khan Slams Pakistan players ahead of ICC Cricket World Cup 2023: భారత్తో మ్యాచ్ అంటేనే తమ ఆటగాళ్లు వణికిపోతున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ పేర్కొన్నాడు. సీనియర్లు ఎవరూ కెప్టెన్ బాబర్ ఆజమ్కు సలహాలు ఇవ్వడం లేదన్నాడు. జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదని, ఇలా అయితే ప్రపంచకప్ గెలవడం కష్టమే అని మొయిన్ ఖాన్ మండిపడ్డాడు. ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఏకంగా 228 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. శ్రీలంక మ్యాచ్లోనూ ఓడిపోయి విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ప్రదర్శనపై మొయిన్ ఖాన్ స్పందించాడు.
మొయిన్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ… ‘కెప్టెన్ బాబర్ ఆజమ్కు పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్ సలహాలు ఇవ్వడానికి భయపడ్డారు. రిజ్వాన్, షాదాబ్, ఫఖర్, షాహిన్.. వీళ్లంతా బాబర్కు సలహాలు ఇవ్వలేకపోయారు. జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదు. గేమ్ ప్లాన్ గురించి ఆటగాళ్ల మధ్య చర్చలు జరుగుతున్నాయో లేదో అని నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ సీనియర్లు సలహాలు ఇచ్చినా.. వాటిని పాటించడం లేదేమో. ఎందుకో తెలియదు కానీ.. భారత్తో మ్యాచ్ అంటేనే పాకిస్తాన్ ప్లేయర్స్ వణికిపోతున్నారు’ అని అన్నాడు.
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
Also Read: Cops Harass Woman: పార్క్లో కూర్చున్న యువతిని లైంగికంగా వేధించి.. డబ్బు వసూలు చేసిన పోలీసులు!
‘తాము ఇచ్చిన సలహాలు పనిచేయకపోతే.. మ్యాచ్ ఫలితం గురించి చింతించక తప్పదనే ఆందోళన సీనియర్లలో కనిపిస్తోంది. ఓ పటిష్టమైన జట్టుతో ఆడుతున్నప్పుడు ఇలాంటి భయాలు సహజమే. అయితే పూర్తి స్థాయిలో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు ఆటగాళ్లు ప్రదర్శించాలి. ప్రతికూల ఫలితం వస్తుందనే భయం ఉన్నా.. బాడీ లాంగ్వేజ్లో దాన్ని కనిపించకుండా జాగ్రత్త పడాలి. ప్రపంచకప్ ఉంది. ఇప్పటికైనా అందరూ మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తే మంచిది’. భారత్తో మ్యాచ్ మిగతా మ్యాచ్ లానే ఆడితే ఒత్తిడి అధిగమించొచ్చు’ అని మొయిన్ ఖాన్ సూచనలు చేశాడు. అక్టోబరు 14న భారత్తో పాకిస్తాన్ తలపడనుంది.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!