Cops Harass Woman: పార్క్లో కూర్చున్న యువతిని లైంగికంగా వేధించి.. డబ్బు వసూలు చేసిన పోలీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cops Harass Woman In Ghaziabad Park: ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల యూపీలోని ఘాజియాబాద్లో త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. సరదాగా సమయం గడిపేందుకు వెళ్లిన ఆ జంట నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా.. యువతిని గంటల తరబడి లైంగిక వేధింపులకు గురిచేశారు. వేధింపులు తాళలేని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సెప్టెంబర్ 16న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బులంద్షహర్కు చెందిన ఓ జంట మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ జంట సరదాగా గడిపేందుకు సాయి ఉప్వాన్ సిటీ పార్క్కు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వారి వద్దకు ముగ్గురు పోలీసులు సాధారణ దుస్తుల్లో వచ్చారు. వారిని బెదిరించి రూ. 10 వేలు ఇవ్వాలని ఒకరు డిమాండ్ చేశాడు. రూ. 5.5 లక్షలు ఇవ్వాలని మరొకరు వేధించారు. డబ్బులు ఇవ్వకుంటే జైలుకే అంటూ యువకుడిని బెదిరించారు.
Also Read
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
తమని వదిలేయమంటూ పోలీసుల కాళ్లు పట్టుకొని ఆ జంట వేడుకున్నా.. పోలీసులు వదలలేదు. మూడు గంటల పాటు పార్క్లో ఆ జంటను వేధించారు. యువతిని అనుచితంగా తాకారు. యువకుడి నుంచి కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ముగ్గురు పోలీసులు అంతటితో ఆ జంటను వదిలిపెట్టలేదు. తరచూ యువతికి ఫోన్ చేసి వేధింపులకు పాల్పడడమే కాకుండా.. యువతిని కలిసేందుకు అర్ధరాత్రి ఆమె ఇంటికి కూడా వెళ్లేవారు. పోలీసుల వేధింపులు తాళలేని ఆ జంట.. కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 28న ఫిర్యాదు చేసింది.
Also Read: Asian Games 2023: టేబుల్ టెన్నిస్లో చరిత్ర.. రోలర్ స్కేటింగ్లో రెండు పతకాలు!
పోలీసులతో ఫోన్లో జరిపిన సంభాషణను యువతి సాక్ష్యంగా చూపింది. దీంతో ఆ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రాకేశ్ కుమార్, దిగంబర్ కుమార్గా గుర్తించారు. మూడో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై రాకేష్ కుమార్ను సస్పెండ్ చేశామని, అతనిపై చర్యలు తీసుకోవాలని దిగంబర్ విభాగానికి లేఖ పంపామని గజియాబాద్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.
తాజావార్తలు
-
CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
-
Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
-
Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!