Cops Harass Woman: పార్క్లో కూర్చున్న యువతిని లైంగికంగా వేధించి.. డబ్బు వసూలు చేసిన పోలీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cops Harass Woman In Ghaziabad Park: ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల యూపీలోని ఘాజియాబాద్లో త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. సరదాగా సమయం గడిపేందుకు వెళ్లిన ఆ జంట నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా.. యువతిని గంటల తరబడి లైంగిక వేధింపులకు గురిచేశారు. వేధింపులు తాళలేని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సెప్టెంబర్ 16న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బులంద్షహర్కు చెందిన ఓ జంట మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ జంట సరదాగా గడిపేందుకు సాయి ఉప్వాన్ సిటీ పార్క్కు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వారి వద్దకు ముగ్గురు పోలీసులు సాధారణ దుస్తుల్లో వచ్చారు. వారిని బెదిరించి రూ. 10 వేలు ఇవ్వాలని ఒకరు డిమాండ్ చేశాడు. రూ. 5.5 లక్షలు ఇవ్వాలని మరొకరు వేధించారు. డబ్బులు ఇవ్వకుంటే జైలుకే అంటూ యువకుడిని బెదిరించారు.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
తమని వదిలేయమంటూ పోలీసుల కాళ్లు పట్టుకొని ఆ జంట వేడుకున్నా.. పోలీసులు వదలలేదు. మూడు గంటల పాటు పార్క్లో ఆ జంటను వేధించారు. యువతిని అనుచితంగా తాకారు. యువకుడి నుంచి కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ముగ్గురు పోలీసులు అంతటితో ఆ జంటను వదిలిపెట్టలేదు. తరచూ యువతికి ఫోన్ చేసి వేధింపులకు పాల్పడడమే కాకుండా.. యువతిని కలిసేందుకు అర్ధరాత్రి ఆమె ఇంటికి కూడా వెళ్లేవారు. పోలీసుల వేధింపులు తాళలేని ఆ జంట.. కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 28న ఫిర్యాదు చేసింది.
Also Read: Asian Games 2023: టేబుల్ టెన్నిస్లో చరిత్ర.. రోలర్ స్కేటింగ్లో రెండు పతకాలు!
పోలీసులతో ఫోన్లో జరిపిన సంభాషణను యువతి సాక్ష్యంగా చూపింది. దీంతో ఆ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రాకేశ్ కుమార్, దిగంబర్ కుమార్గా గుర్తించారు. మూడో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై రాకేష్ కుమార్ను సస్పెండ్ చేశామని, అతనిపై చర్యలు తీసుకోవాలని దిగంబర్ విభాగానికి లేఖ పంపామని గజియాబాద్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!