Suicide : పెళ్లి నిశ్చితార్థం ముందు స్నేహితుడి హత్య చూసి జీవితాన్ని విడిచిన యువకుడు
- హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉండాల్సిన భయం.. యువకుడి ఆత్మహత్య
- నిశ్చితార్థానికి ముందు రక్తపాతంతో ముగిసిన మద్యం పార్టీ
- ఒకే రోజు రెండు ఘటనలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ కనెక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide : సికింద్రాబాద్లోని వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో ఒక విషాద సంఘటన కలకలం రేపింది. మయ్ 4న నిశ్చితార్థం జరగాల్సిన యువకుడు, తన మిత్రుడు హత్యకు గురవడం చూసి తీవ్ర మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు ఒక్కరోజే చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. బౌద్ధనగర్కు చెందిన మోహన్ కృష్ణ అనే బైక్ మెకానిక్కు పెళ్లి నిశ్చితార్థం మే 4న జరగాల్సి ఉంది. అయితే, నిశ్చితార్థానికి ముందు అంటే ఏప్రిల్ 27 రాత్రి మోహన్ తన స్నేహితులు శ్యాంసన్ రాజు, మరికొందరితో కలిసి మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీ సమయంలో శ్యాంసన్ రాజు , అతని బావ లూథరస్ మధ్య తీవ్ర మాటల తూటాలు పేలాయి. తీవ్రంగా చినగిపోయిన గొడవలో, లూథరస్ తన బావ శ్యాంసన్ రాజును ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో శ్యాంసన్ స్పాట్లోనే మృతిచెందాడు.
Nara Lokesh: సింహాచలం ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసింది
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఈ ఘటనను తన కళ్లారా చూసిన మోహన్ కృష్ణ తీవ్ర దైర్యభంగం చెందాడు. పెళ్లి కావాల్సిన ఈ సమయంలో తాను పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు తిరగాల్సి వస్తుందని, హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా నిలవాల్సి వస్తుందన్న భయంతో మానసికంగా కుంగిపోయాడు. ఎలాంటి ఆలోచనలకు లోనై చివరకు ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. పోలీసులు మొదట శ్యాంసన్ రాజు హత్య కేసును పార్షిగుట్టలో, మోహన్ కృష్ణ ఆత్మహత్య కేసును వారాసిగూడలో వేర్వేరుగా నమోదు చేశారు. అయితే, విచారణలో ఈ రెండు కేసులు ఒకే సందర్భానికి చెందినవని గుర్తించారు. మోహన్ ఆత్మహత్యకు శ్యాంసన్ హత్యను ప్రత్యక్షంగా చూడడం ప్రధాన కారణమని నిర్ధారించారు. ఈ ఘటన స్నేహితుల మధ్య గొడవ ఎలా ప్రాణాలను బలితీసుకుంటుందో మళ్ళీ ఒకసారి నిరూపించింది. సంతోషకరమైన వేడుకకు సన్నాహాలు చేస్తుండగా, ఒక్క అనూహ్య సంఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
Imran Khan: పహల్గామ్ ఘటన మనసు కలిచివేసింది.. భారత్ నిందలు వేయడం తగదన్న పాక్ మాజీ ప్రధాని
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!