Imran Khan: పహల్గామ్ ఘటన మనసు కలిచివేసింది.. భారత్ నిందలు వేయడం తగదన్న పాక్ మాజీ ప్రధాని
- పహల్గామ్ ఘటన మనసు కలిచివేసింది
- భారత్ నిందలు వేయడం తగదన్న పాక్ మాజీ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడిపై పాకిస్థా్న్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ప్రాణ నష్టం జరగడం విషాదకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు మంగళవారం ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తాజా ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Pakistan: భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది.. ధీటుగా ఎదుర్కొంటామన్న పాక్ మంత్రి
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా పాకిస్థాన్పై భారత్ నిందలు వేసిందని.. ఇప్పుడు కూడా అదే మాదిరిగా మోడీ సర్కార్ నిందలు వేస్తోందని తెలిపారు. తన హయాంలో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినా భారత్కు ముందుకు రాలేదన్నారు. 2019లో జరిగినట్లుగానే.. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ భారత్ దుస్సాహసానికి దిగితే.. అందుకు పాకిస్థాన్ కూడా అణు ఘర్షణతో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. దేశాల మధ్య చెలగాటం ఆడకుండా బాధ్యతాయుతంగా భారత్ వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
శాంతినే మా ప్రాధాన్యత అన్నారు. దాన్ని పిరికితనం అని తప్పుగా భావించకూడదన్నారు. ఇక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీలపై విమర్శలు గుప్పించారు. స్వార్థపరులైన వ్యక్తలు నుంచి మంచిని ఆశించడం అమాయకత్వం అన్నారు. వారి అక్రమ సంపదన.. వ్యాపార ప్రయోజనాలు విదేశాల్లో ఉన్నందున వారు భారతదేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడరన్నారు. అందుకే వారంతా ప్రస్తుతం మౌనంగా ఉన్నారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. 2023 నుంచి వివిధ కేసుల్లో జైల్లో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Kolkata: హోటల్లో ఘోర అగ్నిప్రమాదం, 14 మంది మృతి
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలు పాలయ్యారు. అనంతరం పాకిస్థా్న్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలను నిలిపివేసింది. అలాగే పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసివేసింది. పాక్ యూట్యూబ్ ఛానళ్లు నిలిపివేసింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
“Loss of human life in Pahlgam incident is deeply disturbing and tragic. I extend my deepest condolences to the victims and their families.
When the False Flag Palwama Operation incident happened, we offered to extend all-out cooperation to India but India failed to produce any…
— Imran Khan (@ImranKhanPTI) April 29, 2025
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!