Spoiled Meat: హైదరాబాద్లోని హోటల్స్లో ఇలాంటి మాంసాన్ని తింటున్నామా..? బాబోయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నం పెట్టే చేయిని దేవుడితో సమానంగా చూస్తాం. కానీ.. అదే చేత్తో విషం కలిపి పెడితే..? భాగ్యనగరంలో తాజాగా వెలుగుచూసిన కుళ్ళిన మాంసం ఉదంతం వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. ఒక మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ.. కేవలం కొన్ని రూపాయల లాభం కోసం ఇంతటి నీచానికి ఒడిగడతారా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో హోటల్కు వెళ్లి ముక్క ముట్టుకోవాలంటేనే భయం వేసే పరిస్థితి ఏర్పడింది. కష్టపడి సంపాదించిన డబ్బుతో నాలుగు మెతుకులు ప్రశాంతంగా తిందామనుకునే సామాన్యుడి నమ్మకాన్ని కాలరాస్తున్న ఈ ‘ఆహార ఉగ్రవాదం’పై ఉక్కుపాదం మోపాల్సిన సమయం వచ్చింది.
నగరంలో ‘కుళ్ళిన మాంసం’ దందా..
Also Read
- Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
హైదరాబాద్లోని మంగళ్హాట్ పరిధిలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ , జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించిన సంయుక్త దాడుల్లో వెలుగుచూసిన వాస్తవాలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేశాయి. మొహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి “A to Z Sheep And Goat Offals” పేరుతో నిర్వహిస్తున్న వ్యాపారం వెనుక ఉన్న నిజాలు బయటపడ్డాయి.
మోసపూరిత విక్రయాల తీరు..
ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి అత్యంత తక్కువ ధరకు పాడైపోయిన గొర్రె, మేక అవయవాలను (లివర్, కిడ్నీ వంటివి) అఫ్రోజ్ తెప్పించేవాడు. వీటిని నెలల తరబడి డీప్ ఫ్రీజర్లలో, పాడైపోయిన నీరు ఉన్న ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ చేసేవారు. దుర్వాసన రాకుండా రసాయనాలను వాడుతూ, ప్రజలకు అది తాజా మాంసం అని నమ్మబలికి విక్రయించేవారు. తాజా దాడిలో ఏకంగా 14 టన్నుల కుళ్ళిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ హోటళ్లకు సరఫరా..
కేవలం చిన్న చిన్న దుకాణాలకే కాకుండా, హైదరాబాద్లోని కొన్ని పేరుమోసిన హోటళ్లకు కూడా ఈ మాంసం సరఫరా అయినట్లు విచారణలో తేలింది. మనం ఎంతో ఇష్టంగా తినే బిర్యానీలు, ఇతర మాంసాహార వంటకాల్లో ఈ కుళ్ళిన మాంసమే వాడుతున్నారన్న వార్త ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.
పదే పదే అదే తప్పు..
విచారణలో మరో సంచలన విషయం ఏంటంటే.. ఇదే వ్యక్తిపై గడిచిన మార్చి 10వ తేదీనే జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. అయినప్పటికీ బుద్ధి మార్చుకోకుండా.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ మళ్లీ అదే దందా కొనసాగించాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
డబ్బు పిచ్చితో మనుషుల ప్రాణాలను బలితీసుకునే ఇలాంటి కసాయిలపై కేవలం జరిమానాలతో సరిపెట్టకూడదు. కఠినమైన శిక్షలు పడితేనే సామాన్యుడి ప్లేటులోకి వచ్చే ఆహారం సురక్షితంగా ఉంటుంది. తినే ఆహారం విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
-
Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
-
Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
-
Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!