Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Hyderabad Land Grabbing Mafia Middle Class Properties Targeted

Land Grabbing Mafia: హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న కబ్జారాయుళ్లు.. మధ్యతరగతి ఆస్తులే టార్గెట్‌గా కబ్జాలు!

Published Date :August 29, 2025 , 10:22 pm
By Sampath Kumar
  • హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న కబ్జారాయుళ్లు
  • ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు ఆక్రమణలు
  • మధ్యతరగతి ఆస్తులే టార్గెట్‌గా కబ్జాలు
  • ధర వచ్చినప్పుడు భూముల అమ్ముకం
  • 20 మందిని పట్టుకున్న రాచకొండ పోలీసులు
Land Grabbing Mafia: హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న కబ్జారాయుళ్లు.. మధ్యతరగతి ఆస్తులే టార్గెట్‌గా కబ్జాలు!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

హైదరాబాద్‌లో కబ్జారాయుళ్లు హడలెత్తిస్తున్నారు. ఖాళీ స్థలాల కనిపిస్తే చాలు ఆక్రమించుకుంటున్నారు. ఆ స్థలాలను కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. అలాంటి ఓ గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. పేదలు, మధ్యతరగతి ఆస్తులే టార్గెట్‌గా కబ్జాలు చేస్తున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలా ఆక్రమించేస్తున్నారు. విలువ పెరిగితే భూములు అమ్ముకుందామనుకున్న వాళ్లను నిలువునా ముంచేస్తున్నారు. ఆస్తులు అంతస్తులు లేకపోయినా మనకంటూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉంటారు జనం. చాలామంది స్థలాలను కొనుక్కొని పెట్టుకుంటారు. ఎప్పుడైనా దానికి ధర పెరగబోతుందా?అప్పుడు అమ్ముకొందామనుకుంటారు. ముఖ్యంగా నిరుపేదలు, కొద్దిగా డబ్బు ఉన్నవాళ్లు ఎక్కువగా స్థలాల మీద పెట్టుబడి పెడుతున్నారు. ఆ తర్వాత ధర వచ్చినప్పుడు అమ్ముకుంటున్నారు.

Also Read

  • Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
  • Uttar Pradesh: బీజేపీ "మిషన్ యూపీ 2027" స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
  • Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్‌మెంట్
  • BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ రాజకీయాలతో సంబంధం..
Add as a preferred
source on google

ఐతే…అలాంటి ఖాళీ స్థలాలను ఇప్పుడు కబ్జారాయుళ్ల కన్నుపడింది. ఏకంగా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి అమ్ముకుంటున్నారు. కీసర పక్కనే ఉన్న భువనగిరి, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలు కనబడితే చాలు ఆక్రమిస్తున్నారు. వాటికి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మేస్తున్నారు. ఇలాంటి 20 మంది సభ్యుల ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు చాలా ఖాళీ స్థలాలను అమ్మినట్లు తెలిపారు పోలీసులు.

ఇక…ఈ ముఠాలో కీలక వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. కీసర, రాంపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్ ప్రాంతాల్లో వీళ్లు తిరుగుతుంటారు. 500 గజాల లోపు ఉన్న చిన్న స్థలాలను టార్గెట్ చేస్తారు. ఆ స్థలాలు చాలా రోజులపాటు వీళ్లు అబ్జర్వ్ చేస్తారు. ఆ స్థలాలకు ఎవరూ రావడంలేదని గుర్తించిన తర్వాత నకిలీ పేపర్లను తయారు చేస్తారు. సంపంగి సురేష్, అరవింద్, హరిప్రసాద్ ఈ ముగ్గురి పేర్ల మీద పేపర్లను క్రియేట్ చేస్తారు. ముందుగా ఒకరి నుంచి ఒకరు ఆ ల్యాండ్‌ను కొనుగోలు చేసుకున్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అందుకు సంబంధించిన అన్ని పత్రాలను కూడా వీళ్లే సొంతంగా తయారు చేసుకుంటారు. నకిలీ పత్రాలు తీసుకువెళ్లి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పిస్తారు. ఆ పేపర్లు చూసిన తర్వాత ఒకరు కొనుగోలుదారుగా…మరొకరు అమ్మకందారుగా ఉంటారు. కొనుగోలు, అమ్మకాలు జరిపే ఇద్దరు ఉన్న తర్వాత ప్లాట్‌ను ఇతరులకు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు.

ఐతే…ఇంతవరకు పని అయిపోయింది అనుకుంటే కుదరదు. మరో మూడు నెలల తర్వాత మరొక రిజిస్ట్రేషన్ చేస్తారు. మరొక నెల రోజుల తర్వాత మరో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇలా వెనువెంటనే మూడు రిజిస్ట్రేషన్‌లను పూర్తిచేసుకుంటారు. ఆరు నెలల కాలంలో ఆ ల్యాండ్‌ను పూర్తిస్థాయిలో వీరి పేరు మీదికి వచ్చేటట్టుగా మారిపోతుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సదరు ఫ్లాట్ ఓనర్ గుర్తిస్తే దానిపై సమస్యలు ఉంటాయి. మూడుసార్లు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫ్లాట్ ఓనర్ వెళ్ళినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నేరుగా వెళ్లి ఆ ఫ్లాట్‌ను వీళ్లు కబ్జా చేస్తారు. నిజమైన ఫ్లాట్ ఓనర్ అక్కడికి చేరుకుంటే అతన్నే దబాయిస్తారు. మేం ఎప్పుడో కొనుగోలు చేశామని…ఈ ఫ్లాట్ మీద మీకు ఎలాంటి రైట్స్ లేవంటారు. ఈ ఫ్లాటు మేం వీళ్ల దగ్గర నుంచి కొనుగోలు చేసుకున్నామని చెప్పి పేపర్లను ముందు పెడతారు. వీటిని చూసి నిజమైన ఓనరు భయపడిపోతాడు. ఇలా ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఫ్లాట్లను వీళ్ళు తమ పేర్లు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకున్నారని తెలిపారు పోలీసులు.

కీసర, రాంపల్లి ప్రాంతం నుంచి పదేపదే ఇలాంటి కంప్లైంట్స్ రావడంతో రాచకొండ ఎస్ఓటి పోలీసులు గ్యాంగ్‌పై నిఘా పెట్టారు. మొత్తంగా 13 మందిని పట్టుకున్నారు. ఇంకా కొంతమంది పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. కబ్జా చేసి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్ముకుంటున్నారని అధికారులు నిర్ధారించారు. ఇలాంటి గ్యాంగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • Hyderabad land grabbing
  • Hyderabad Land Grabbing Mafia
  • Hyderabad property scam
  • Land Grabbing Mafia

తాజావార్తలు

  • Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్‌లో పడ్డట్లే..

  • Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్

  • Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత

  • Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!

  • Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions