India vs Malaysia: హైదరాబాద్లో ఫిఫా ఫుట్బాల్ మ్యాచ్.. మలేసియాతో భారత్ ఢీ!
- అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్కు హైదరాబాద్ ఆతిథ్యం
- గచ్చిబౌలిలో మైదానంలో భారత్ vs మలేసియా
- జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత సెప్టెంబర్లో ఇంటర్కాంటినెంటల్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్.. మరో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. సోమవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి మైదానంలో భారత్, మలేసియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు సంబంధించి ఏర్పాట్లను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఇప్పటికే పూర్తిచేసింది. తొలిసారి హైదరాబాద్ వేదికగా ఫిఫా మ్యాచ్ జరుగుతుండడంతో ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. రాత్రి 7:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఈ ఏడాదిలో 10 మ్యాచ్లు ఆడిన భారత్ 4 డ్రాలు, 6 ఓటములను ఎదుర్కొంది. 2024లో ఒక్క విజయం సాధించని భారత్.. మలేసియాపై గెలవాలని చూస్తోంది. ఈ ఏడాది భారత జట్టుకు ఇదే చివరి మ్యాచ్ కావడంతో విజయం సాధించి.. వచ్చే ఏడాది మార్చిలో ఆరంభమయ్యే 2027 ఆసియా కప్ క్వాలిఫయర్స్కు సిద్ధమవ్వాలని చూస్తోంది. గాయం కారణంగా దాదాపు 10 నెలలు దూరంగా ఉన్న సెంట్రల్ డిఫెండర్ సందేశ్ జట్టుతో చేరుతున్నాడు. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్లో భారత్ 125వ స్థానంలో ఉండగా.. మలేసియా 133వ స్థానంలో ఉంది.
Also Read
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
- Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
Also Read: Nitish Reddy Debut: పెర్త్ టెస్ట్.. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి టెస్టు అరంగేట్రం ఖాయమే!
భారత ఫుట్బాల్ జట్టు ఇప్పటివరకు అత్యధిక సార్లు తలపడిన జట్టు మలేసియానే కావడం విశేషం. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్లు జరగగా.. చెరో 12 మ్యాచ్ల్లో గెలిచాయి. ఎనిమిది మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. గుర్ప్రీత్ సింగ్ సంధు, సందేశ్ జింగాన్, మెహతాబ్, విశాల్, రోషన్ సింగ్, అమరిందర్ సింగ్, సురేశ్ సింగ్లు భారత జట్టుకు కీలకం కానున్నారు. విదేశీ ఆటగాళ్లను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడంతో మలేసియా టీమ్.. భారత్ కంటే బలంగా ఉంది. నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం.
తాజావార్తలు
-
NTRNeel :’డ్రాగన్’ గ్లిమ్స్ అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందుగానే
-
Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
-
IPL 2026 playoff scenarios: నేడు కీలక మ్యాచ్.. సీఎస్కే-ఎస్ఆర్హెచ్ పోరుతో మారనున్న ప్లేఆఫ్స్ సమీకరణాలు!
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..