Kishan Reddy : హైదరాబాద్ గ్లోబల్ హెల్త్కేర్, ఫార్మా హబ్గా ఎదుగుతోంది
- భారత్ - ప్రపంచ వ్యాక్సిన్ & జెనరిక్ మెడిసిన్ సప్లయర్
- భారత్ - ప్రపంచ వ్యాపార హబ్గా ఎదుగుతున్న ప్రగతి
- "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" లో అగ్రగామి భారత్ : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : హైదరాబాద్ ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీగా, అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రుల కేంద్రంగా ఖ్యాతికెక్కిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 22వ ఎడిషన్ బయో ఆసియా-2025 లాంటి గ్లోబల్ ఈవెంట్స్ నగర వేదికగా జరగడం, హెల్త్కేర్ రంగంలోని సాంకేతికత, సుస్థిరమైన పద్ధతుల గురించి చర్చించడం ఎంతో ఆనందకరమని అన్నారు.
బుధవారం బయో ఆసియా-2025 సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కిషన్రెడ్డి, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఆవిష్కర్తలకు పురస్కారాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, లైఫ్సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, హెల్త్కేర్ రంగాల్లో భారత్ విశేష పురోగతి సాధిస్తున్నదని చెప్పారు. ముఖ్యంగా, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని గుర్తు చేశారు.
Also Read
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
ప్రపంచ ప్రజలకు సరసమైన ధరల్లో మందులు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో భారతదేశం ప్రపంచ అవసరాల్లో 60% వ్యాక్సిన్లు, 20% జెనరిక్ మందులు సరఫరా చేస్తోందని వివరించారు. గత పది సంవత్సరాల్లో భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల విలువ రెట్టింపు అయిందని, 2014లో 15 బిలియన్ డాలర్లు ఉన్న ఫార్మా ఎగుమతులు, 2024 నాటికి 27.85 బిలియన్ డాలర్లకు పెరిగాయని వెల్లడించారు.
భారతీయ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టడం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలో మూడో స్థానానికి ఎదుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
కిషన్రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ దూరదృష్టి వల్ల రక్షణ రంగం ఎగుమతుల్లో టాప్-25 దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని అన్నారు. 2014లో ఒక్క మొబైల్ఫోన్ కూడా ఎగుమతి చేయలేని స్థితి నుంచి, ప్రస్తుతం రూ.1.28 లక్షల కోట్ల విలువైన మొబైల్ఫోన్లను ఎగుమతి చేస్తున్నాం అని తెలిపారు. రానున్న రెండు సంవత్సరాల్లో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల గ్లోబల్ ఎకానమీగా ఎదుగుతుందనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వివరించారు.
2014కి ముందు “ఫియర్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” (వ్యాపారం చేయాలన్న భయం) ఉండేదని, కానీ 2014 తర్వాత “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” దిశగా దేశం మార్పు చెందిందని తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవడం వంటి సంస్కరణల వల్ల సాధ్యమైందన్నారు.
అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం, భారత్లో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని కిషన్రెడ్డి వివరించారు. సంపద సృష్టిలో భాగంగా ఇటీవల బడ్జెట్లో ఆదాయపన్ను పరిమితిని రూ.12 లక్షల వరకు పెంచడం, భారత ఆర్థిక వ్యవస్థ బలపడటానికి దోహదం చేస్తుందని తెలిపారు.
హైదరాబాద్ “బల్క్ డ్రగ్ క్యాపిటల్”గా, “వ్యాక్సిన్ క్యాపిటల్”గా ఎదుగుతోందని కిషన్రెడ్డి తెలిపారు. 800కి పైగా ఫార్మా, బయోటెక్, మెడిటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయన్నారు. హైదరాబాద్కు చెందిన జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్ వంటి సంస్థలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు.
2047 నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్సైన్సెస్ ఎకానమీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని, “మెడ్టెక్ మిత్ర” వంటి ప్రాజెక్టులు ఆవిష్కర్తలకు, స్టార్టప్స్కు సహాయపడతాయని అన్నారు. గ్లోబల్ హెల్త్కేర్ రంగంలో భారత్ ముందంజలో ఉంటుందన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు కలిసి భారత ఆరోగ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. “వసుధైవ కుటుంబకం” భావనకు ప్రతిబింబంగా భారత్ నిలుస్తుందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
Solo Traveling: సోలో ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారా? ఇవి పాటించండి..
తాజావార్తలు
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!