Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ ఐటీ హబ్గా పేరుగాంచిన గచ్చిబౌలిలోని ప్రముఖ ‘రాయల్ స్పైస్’ రెస్టారెంట్లో తాజాగా జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నగర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. బయటకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ హోటల్ లోపలి అసలు రంగు చూసి తనిఖీలకు వెళ్లిన అధికారులే నోరెళ్లబెట్టారు. విలాసవంతమైన వాతావరణంలో రుచికరమైన బిర్యానీలు, కూరలు ఆరగిస్తున్నామని మురిసిపోయే కస్టమర్ల ఆరోగ్యంతో ఈ రెస్టారెంట్ యాజమాన్యం ఎంతలా చెలగాటమాడుతుందో ఈ తనిఖీల్లో వెలుగుచూసింది.
ప్రధానంగా రెస్టారెంట్ కిచెన్లోకి అడుగుపెట్టిన అధికారులకు అక్కడ కనిపించిన దృశ్యాలు తీవ్ర అసహ్యానికి గురిచేశాయి. వంట గదిలో భారీ స్థాయిలో పురుగులు విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించాయి. ఇక వాష్ ఏరియా, కిచెన్, డైనింగ్ ప్రాంతాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎక్కడికక్కడ ఆహార వ్యర్థాలు పేరుకుపోయి, నీరు నిల్వ ఉండిపోవడంతో ఆ ప్రాంతమంతా భరించలేనంత దుర్వాసనతో నిండిపోయింది. హోటల్ గోడలు, కిటికీలు తీవ్ర అపరిశుభ్రంగా మారిపోయి, కనీస నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు వంటల్లో పరిమితికి మించి రసాయనాలతో కూడిన ఫుడ్ కలర్స్ను భారీగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read
- Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
అంతేకాకుండా, వంటల తయారీకి ఉపయోగిస్తున్న తాగునీటి నాణ్యతకు సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలను (Water Quality Certificates) చూపించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. వీటన్నింటికీ తోడు, వండుతున్న ఆహార పదార్థాల పక్కనే మూతలు లేని చెత్త డబ్బాలను ఉంచడం అధికారులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీనివల్ల ఆహారం కలుషితమై ప్రజలు తీవ్ర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆహార భద్రతా నిబంధనలను బేఖాతరు చేస్తూ, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న రాయల్ స్పైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే కఠిన నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఈ ఘటనతో, గచ్చిబౌలి పరిసరాల్లోని మిగతా హోటల్ నిర్వాహకుల్లోనూ ఇప్పుడు వణుకు మొదలైంది.
తాజావార్తలు
-
Kaaka vs Vishwambhara:’కాకా’ vs ‘విశ్వంభర’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!