Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ ఐటీ హబ్గా పేరుగాంచిన గచ్చిబౌలిలోని ప్రముఖ ‘రాయల్ స్పైస్’ రెస్టారెంట్లో తాజాగా జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నగర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. బయటకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ హోటల్ లోపలి అసలు రంగు చూసి తనిఖీలకు వెళ్లిన అధికారులే నోరెళ్లబెట్టారు. విలాసవంతమైన వాతావరణంలో రుచికరమైన బిర్యానీలు, కూరలు ఆరగిస్తున్నామని మురిసిపోయే కస్టమర్ల ఆరోగ్యంతో ఈ రెస్టారెంట్ యాజమాన్యం ఎంతలా చెలగాటమాడుతుందో ఈ తనిఖీల్లో వెలుగుచూసింది.
ప్రధానంగా రెస్టారెంట్ కిచెన్లోకి అడుగుపెట్టిన అధికారులకు అక్కడ కనిపించిన దృశ్యాలు తీవ్ర అసహ్యానికి గురిచేశాయి. వంట గదిలో భారీ స్థాయిలో పురుగులు విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించాయి. ఇక వాష్ ఏరియా, కిచెన్, డైనింగ్ ప్రాంతాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎక్కడికక్కడ ఆహార వ్యర్థాలు పేరుకుపోయి, నీరు నిల్వ ఉండిపోవడంతో ఆ ప్రాంతమంతా భరించలేనంత దుర్వాసనతో నిండిపోయింది. హోటల్ గోడలు, కిటికీలు తీవ్ర అపరిశుభ్రంగా మారిపోయి, కనీస నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు వంటల్లో పరిమితికి మించి రసాయనాలతో కూడిన ఫుడ్ కలర్స్ను భారీగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read
- ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం... 2027 వరల్డ్ కప్లో అసలు ఏం జరగబోతోంది..?
- Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
- India On PoK: పీఓకే ఎన్నికలు కేవలం నాటకం.. పాకిస్తాన్పై భారత్ ఫైర్..
అంతేకాకుండా, వంటల తయారీకి ఉపయోగిస్తున్న తాగునీటి నాణ్యతకు సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలను (Water Quality Certificates) చూపించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. వీటన్నింటికీ తోడు, వండుతున్న ఆహార పదార్థాల పక్కనే మూతలు లేని చెత్త డబ్బాలను ఉంచడం అధికారులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీనివల్ల ఆహారం కలుషితమై ప్రజలు తీవ్ర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆహార భద్రతా నిబంధనలను బేఖాతరు చేస్తూ, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న రాయల్ స్పైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే కఠిన నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఈ ఘటనతో, గచ్చిబౌలి పరిసరాల్లోని మిగతా హోటల్ నిర్వాహకుల్లోనూ ఇప్పుడు వణుకు మొదలైంది.
తాజావార్తలు
-
ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం… 2027 వరల్డ్ కప్లో అసలు ఏం జరగబోతోంది..?
-
Plastic Notes: దేశ కరెన్సీ చరిత్రలో మరో కీలక మార్పు.. ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీకి రంగం సిద్ధం!
-
Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
-
CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
-
India On PoK: పీఓకే ఎన్నికలు కేవలం నాటకం.. పాకిస్తాన్పై భారత్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!