Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!
- హైదరాబాద్ గోల్కొండ తారామతి బారాదరి సమీపంలో డ్రగ్స్ పార్టీ బస్ట్
- ఈగల్ టాస్క్ ఫోర్స్ & పోలీసుల సంయుక్తంగా మెరుపు దాడులు
- రిసార్ట్లో జరుగుతున్న ఈవెంట్పై సడెన్ రైడ్
- పార్టీలో పాల్గొన్న వారిపై యూరిన్ డ్రగ్ టెస్టులు నిర్వహణ
- ఇప్పటివరకు 6 మందికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ
- బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Drug Party Busted: హైదరాబాద్ నగర శివార్లలోని గోల్కొండ తారామతి బారాదరి పరిసరాల్లో ఉన్న ఓ రిసార్ట్లో శనివారం రాత్రి డ్రగ్స్ కలకలం రేగింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ టాస్క్ ఫోర్స్ బృందం, రిసార్ట్ లో జరుగుతున్న ‘జాక్ జాన్సన్’ ఈవెంట్ పై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో పలువురు ప్రముఖులు డ్రగ్స్ సేవించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
- BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈగల్ టీం & టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. రిసార్ట్ లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఈవెంట్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడమే కాకుండా, అనుమానితులకు అక్కడికక్కడే యూరిన్ డ్రగ్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు సాగిన ఈ తనిఖీల్లో ఇప్పటివరకు ఆరుగురికి గంజాయి, ఇతర డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలింది.
ఈ డ్రగ్స్ పార్టీలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటులు, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నట్లు సమాచారం. సెలబ్రిటీల సమక్షంలో ఈ ఈవెంట్ జరుగుతుండటంతో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే డ్రగ్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
యూరిన్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి ఆదివారం మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నివేదికలు అందిన తర్వాత, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఈవెంట్ వెనుక ఉన్న నిర్వాహకులు ఎవరు? డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!