Hyderabad Crime: బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై అత్యాచారయత్నం.. నలుగురు అరెస్ట్
- హైదరాబాద్లోని బోరబండలో దారుణం
- బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై నలుగురు అత్యాచారయత్నం
- పేరెంట్స్ను కత్తితో బెదిరించి మరీ అఘాయిత్యానికి యత్నం
- నలుగురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
- పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: ఓ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన హైదరాబాద్లోని బోరబండలో చోటుచేసుకుంది. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోరబండ సీఐ శేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 17 ఏళ్ల వయస్సున్న బాలిక తన బాయ్ ఫ్రెండ్తో కలిసి బుక్ చేసుకున్న ఆటోలో మాదాపూర్ నుంచి బోరబండలోని ఇందిరానగర్కి వెళ్తోంది. బోరబండ అన్నానగర్ వద్ద నలుగురు వ్యక్తులు ఆటోను అడ్డగించారు. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు.. అని యువతిని ప్రశ్నించారుఇద్దరు బలవంతంగా వారి ఆటోలోకి ప్రవేశించారు. ఒక యువకుడు అమ్మాయి పక్కన కూర్చున్నాడు. యువకుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ వేధించాడు.
Read Also: Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు విక్రయాలు
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
అడ్డుకోబోయిన బాలిక ప్రియుడిని ఆ యువకులు బెదిరించారు. మరో ఇద్దరు యువకులు బైక్పై ఆటోను ఫాలో అయ్యారు. ఆటో డ్రైవర్ బలవంతంగా అందరినీ బయటకు దింపి వెళ్ళిపోయాడు.
బాలిక తన ఇంటి వైపు వెళ్తుండగా.. ఆమె వెంటే అనుసరించి ఆ నలుగురు యువకులు వెళ్లారు. ప్రియుడిని డబ్బులు ఇవ్వాలని ఇద్దరు యువకులు డిమాండ్ చేశారు. బాలిక ఇంటికి చేరుకోగానే.. బాలిక పేరెంట్స్ను కూడా కత్తితో బెదిరించారు. బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై అఘాయిత్యం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో అది గమనించిన పొరుగింటి వ్యక్తి డయల్ 100కి కాల్చేశాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగానే ఆ నలుగురు యువకుు తప్పించుకునే ప్రయత్నం చేశారు.
Read Also: Maharashtra: కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఫైలులో నుంచి బయటకు వచ్చిన విషసర్పం
రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం.. పారిపోయిన మరో ఇద్దరిని ఉదయం అదుపులోకి తీసుకున్నామని బోరబండ సీఐ శేఖర్ వెల్లడించారు. యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. బాలికను భరోసా కేంద్రానికి పంపి స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్నారు. యువకుల నుంచి 3 బైకులు, కత్తి స్వాధీనం చేసుకున్నామని.. వారిని రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!