Hyderabad Crime: బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై అత్యాచారయత్నం.. నలుగురు అరెస్ట్
- హైదరాబాద్లోని బోరబండలో దారుణం
- బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై నలుగురు అత్యాచారయత్నం
- పేరెంట్స్ను కత్తితో బెదిరించి మరీ అఘాయిత్యానికి యత్నం
- నలుగురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
- పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: ఓ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన హైదరాబాద్లోని బోరబండలో చోటుచేసుకుంది. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోరబండ సీఐ శేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 17 ఏళ్ల వయస్సున్న బాలిక తన బాయ్ ఫ్రెండ్తో కలిసి బుక్ చేసుకున్న ఆటోలో మాదాపూర్ నుంచి బోరబండలోని ఇందిరానగర్కి వెళ్తోంది. బోరబండ అన్నానగర్ వద్ద నలుగురు వ్యక్తులు ఆటోను అడ్డగించారు. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు.. అని యువతిని ప్రశ్నించారుఇద్దరు బలవంతంగా వారి ఆటోలోకి ప్రవేశించారు. ఒక యువకుడు అమ్మాయి పక్కన కూర్చున్నాడు. యువకుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ వేధించాడు.
Read Also: Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు విక్రయాలు
Also Read
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
అడ్డుకోబోయిన బాలిక ప్రియుడిని ఆ యువకులు బెదిరించారు. మరో ఇద్దరు యువకులు బైక్పై ఆటోను ఫాలో అయ్యారు. ఆటో డ్రైవర్ బలవంతంగా అందరినీ బయటకు దింపి వెళ్ళిపోయాడు.
బాలిక తన ఇంటి వైపు వెళ్తుండగా.. ఆమె వెంటే అనుసరించి ఆ నలుగురు యువకులు వెళ్లారు. ప్రియుడిని డబ్బులు ఇవ్వాలని ఇద్దరు యువకులు డిమాండ్ చేశారు. బాలిక ఇంటికి చేరుకోగానే.. బాలిక పేరెంట్స్ను కూడా కత్తితో బెదిరించారు. బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై అఘాయిత్యం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో అది గమనించిన పొరుగింటి వ్యక్తి డయల్ 100కి కాల్చేశాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగానే ఆ నలుగురు యువకుు తప్పించుకునే ప్రయత్నం చేశారు.
Read Also: Maharashtra: కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఫైలులో నుంచి బయటకు వచ్చిన విషసర్పం
రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం.. పారిపోయిన మరో ఇద్దరిని ఉదయం అదుపులోకి తీసుకున్నామని బోరబండ సీఐ శేఖర్ వెల్లడించారు. యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. బాలికను భరోసా కేంద్రానికి పంపి స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్నారు. యువకుల నుంచి 3 బైకులు, కత్తి స్వాధీనం చేసుకున్నామని.. వారిని రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
తాజావార్తలు
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!