Variety Thiefs: హైదరాబాద్లో వెరైటీ చోరీ.. అవాక్కవుతున్న జనాలు!
- హైదరాబాద్లో వెరైటీ చోరీ
- మోండా మార్కెట్లో ఆవు దొంగతనం
- అవాక్కవుతున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరైనా దొంగలు ఇళ్లు దోచుకుంటారు.. ఏటీఎంలపై కన్నేస్తారు.. లేదంటే జ్యువెల్లరీ దుకాణాలపై నిఘా పెడతారు. హైదరాబాద్లో కొంత మంది దుండగులు వెరైటీ చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల్లో దుండగులు చేసిన చోరీ చూసి జనం అవాక్కవుతున్నారు. మోండా మార్కెట్లో జరిగిన ఈ దొంగతనం ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతోంది. ఇంతకీ ఆ దొంగలు ఏం చేశారు?.
ఆవును దొంగతనం చేసిన ఘటన సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అర్థరాత్రి పూట ఖరీదైన కార్లలో కొంత మంది యువకులు వచ్చారు. ఆవులకు మత్తు మందు కలిపిన ఆహార పదార్థాలు తినిపించారు. అవి సృహ కోల్పోయిన తర్వాత వాటిని ఆయా కార్లలో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
Also Read
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
నిజానికి ఇలాంటి ఘటనలు మోండా మార్కెట్లో తరచుగా జరుగుతున్నాయి. కానీ ఆవులు ఎక్కడికో వెళ్లిపోయాయని స్థానికులు భావిస్తున్నారు. సీసీ పుటేజీలు పరిశీలించిన తర్వాత జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆవులను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీలను పరిశీలించారు.
మోండా మార్కెట్ సహా సిటీలోని సీసీ ఫుటేజీలన్నీ పరిశీలిస్తున్నారు పోలీసులు. మొత్తంగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు 10 టీమ్స్ ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీల ద్వారా అనుమానితుల్ని గుర్తించినట్లు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయని.. 2024లో 18 మంది గ్యాంగ్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అప్పట్లో ఇలా పశువులను దొంగతనం చేసింది అయూబ్ గ్యాంగ్ అని చెప్పిన పోలీసులు.. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడని తెలిపారు. ఇది మరో గ్యాంగ్ పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. అంతే కాదు.. కార్లను మోడిఫై చేసి ఇలాంటి దొంగతనాలకే వాడుతారని చెబుతున్నారు.
ఏది ఏమైనా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు పశువుల దొంగతనంపై మాత్రం స్థానికులు సీరియస్ అవుతున్నారు. నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
-
5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..