హుజురాబాద్ లో ఈటల సెంటిమెంట్ పని చేస్తుందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్లో గెలుపు బీజేపీకి అవసరం… ఈటల రాజేందర్కి అత్యవసరం. ఈటల దశాబ్ధాల రాజకీయ భవిష్యత్ ఈ ఎన్నికతో ముడిపడి ఉంది. దుబ్బాకలో గెలిచిన తర్వాత.. బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నిక హుజురాబాద్. టీఆర్ఎస్కు ధీటుగా, పోటీగా బీజేపీ కూడా చతురంగ బలగాలను మోహరించింది. బీజేపీ ప్రచారానికి ఫలితం దక్కుతుందా?
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలనే కసితో ఉంది కమలదళం. దుబ్బాక పోరులో విజయం సాధించడం, గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చూపించడంతో.. కమలంపార్టీ నేతల్లో కసి రోజురోజుకీ పెరుగుతోంది. ఈటల పార్టీలో చేరడంతో హుజురాబాద్లో బీజేపీకి పోరాడేందుకు బలమైన అస్త్రం దొరికినట్లైంది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ బీజేపీ బలంగా లేదు. గత ఎన్నికల్లో బీజేపీ కంటే నోటాకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి.
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై క్లారిటీ రాలేదు. కొన్ని రోజుల ఊగిసలాట తర్వాత.. ఆయన బీజేపీలో చేరడంతో.. కాషాయదళం హుజురాబాద్లో దిగింది. ఈటలకు సొంతంగా ఉన్న బలాన్ని కాపాడుకోవడంతో పాటు.. దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న ఎన్నికల వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తూ వచ్చారు పార్టీ నేతలు. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలను యాక్టివేట్ చేయడం.. వారిని ఇంటింటికీ తిప్పడం అనే స్ట్రాటజీని అమలు చేశారు.
బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలను ఇంచార్జ్లుగా నియమించింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కి పార్టీ నియోజక వర్గ బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గం లోని మండలాల కు ఇంచార్జ్ లను పెట్టింది. ఆ తరవాత బూత్ ఇంచార్జ్ లను, శక్తి కేంద్రాల ఇన్చార్జ్లను ఏర్పాటు చేసారు. ఈ నేతలంతా ప్రచారం ముగిసే దాకా హుజూరాబాద్ లోనే మకాం వేశారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్రలో ఉన్నా.. నియోజకవర్గ ఇన్చార్జ్లంతా ఇక్కడే ఉన్నారు. షెడ్యూల్ వచ్చాక ప్రతి మండలానికి మూడు శక్తి కేంద్రాలు సరాసరి 9 పోలింగ్ బూత్ లను అప్పగించింది.
గతంలో నాయకులు ఉప ఎన్నికల ప్రచారం అంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో 5రోజులు ప్రచారం చేశారంటే బీజేపీ ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ సీనియర్ నేతలు, తెలంగాణకు చెందిన వారితో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో బాగంగా.. ఎక్కువగా అధికార పార్టీని టార్గెట్ చేసింది బీజేపీ నాయకత్వం. కేసీఆర్ పాలనతో పాటు వారసత్వ రాజకీయాలను ప్రజల ముందు నిలబెట్టింది. దళిత బందు స్కీమ్ కూడా ఎన్నికల కోసమే అంటూ ఆరోపించారు పార్టీ నాయకులు.
ఈటలకు స్థానికంగా ఉన్న బలం కావచ్చు, బీజేపీ అమలు చేసిన ఎలక్షన్ వ్యూహం కావచ్చు.. గెలుపు మీద గట్టి నమ్మకంతో ఉన్నారు కమలనాథులు. ప్రచార సమయంలో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని అంటున్నారు. తమ అభ్యర్థి చేసిన పనులు ప్రజలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు తమకు కలిసి వస్తాయంటున్నారు బీజేపీ నేతలు. ఆత్మగౌరవం కోసం అధికారం వదులుకున్న ఈటలపై ప్రజల్లో సానుభూతి ఉందని.. అది ఓట్లుగా మారుతుందనేది కమలనాథుల ఆశ.
తాజావార్తలు
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!