Nagpur: భార్యపై అనుమానం..సుత్తితో కొట్టి చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur: నాగ్పూర్లో అనుమానంతో భర్త తన భార్యను హతమార్చిన షాకింగ్ సంఘటన నాగ్పూర్లో వెలుగు చూసింది. ఈ మేరకు నందనవన్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. నిందితుడి పేరు రమేష్ భాస్కర్. మృతి చెందిన మహిళ పేరు అర్చన రమేష్ భాస్కర్. ఈ ఘటనతో నందనవన్ ప్రాంతంలో సంచలనం నెలకొంది. నాగ్పూర్లో హత్యల సీజన్ ఆగే సూచనలు కనిపించడం లేదు. ఏదో ఒక కారణంతో హత్యలు జరుగుతున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి.
Read Also:Mahesh Babu: సూర్యా భాయ్ ఒక డ్రగ్ లాంటోడు…
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
అసలు ఏం జరిగింది?
అర్చన నిరంతరం ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. దీంతో భర్తకు ఆమెపై అనుమానం వచ్చింది. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ వివాదం కారణంగా అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె రెండు నెలల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవ కారణంగా సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించిన భార్యను భర్త అర్ధరాత్రి సుత్తితో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.
Read Also:June Aviation Data: దేశీయ విమాన ట్రాఫిక్లో పెరుగుదల.. జూన్లో 1.24కోట్లకు పైగా ప్రయాణీకులు
సమాచారం అందుకున్న నందనవన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనతో మహిళ కుటుంబీకులు షాక్కు గురయ్యారు. ఆ కుటుంబంలో కొండంత విషాదం నెలకొంది. భాస్కర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. తల్లి హత్యతో బాలికలు అనాథలుగా మారారు. అలాగే హత్య చేసిన తండ్రి జైలుకు వెళ్లడంతో ఈ ఆడపిల్లల పెంపకం చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!