BCCI-IPL 2026: తొలి మ్యాచ్కు ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఈ సీజన్లో కీలక మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Cancels IPL 2026 Opening Ceremony Ahead of RCB vs SRH Match: ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందు కీలక అప్డేట్ వెలువడింది. ఈ సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. అయితే, టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే రెండు రోజుల ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఐపీఎల్ తొలి మ్యాచ్లో ప్రారంభ వేడుక (Opening Ceremony) నిర్వహిస్తారు. కానీ.. ఈ సారి ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్కు ముందు ఎలాంటి వేడుకలూ జరగవని స్పష్టం చేసింది. ప్రతి సీజన్లో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్కు ముందు ఓ వేడుక జరుగుతుంది. ఈ వేడుకకు ప్రముఖ నటులు, గాయకులు, నృత్యకారులు ప్రదర్శన ఇస్తారు. కానీ.. ఈ సారి వీటన్నింటికీ బ్రేక్ పడనుంది. గతేడాది ఆర్సీబీ విజయోత్స వేడుకలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
READ MORE: Form 16: శాలరీడ్ ఉద్యోగులకు అలర్ట్.. ఫారమ్ 16 ఇకపై ఉండదు.. ఏప్రిల్ 1 నుండి మారనున్న ITR నిబంధనలు
Also Read
- Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Wife Kills Husband: ‘‘ఇంట్లోకి రావొద్దు’’.. బాత్రూమ్ హత్య కేసులో సంచలన విషయాలు..
- Pensions: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్షాక్.. లక్ష పెన్షన్లు కట్.. కారణం ఇదే..
- KTR : చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్కు అప్పగించండి.. నీళ్లు ఎత్తి చూపిస్తాం
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు 17 ఏళ్ల కరువును ముగించి తన మొదటి టైటిల్ను గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయోత్సవాల సమయంలో చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మందికి నివాళులర్పించేందుకు ఈసారి ఆర్సీబీ ప్రారంభ మ్యాచ్కు ముందు ఒక నిమిషం మౌనం పాటించాలని నిర్ణయించింది. అదే సమయంలో వారి జ్ఞాపకార్థం స్టేడియంలోని 11 సీట్లు శాశ్వతంగా ఖాళీగా ఉంచనున్నారు. ఇక మరోవైపు.. ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. మార్చి 28న ఈ వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో తమ టైటిల్ను కాపాడుకోవాలని బెంగళూరు లక్ష్యంగా పెట్టుకోగా, సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో తమ రెండో టైటిల్పై కన్నేసింది.
READ MORE: Form 16: శాలరీడ్ ఉద్యోగులకు అలర్ట్.. ఫారమ్ 16 ఇకపై ఉండదు.. ఏప్రిల్ 1 నుండి మారనున్న ITR నిబంధనలు
తాజావార్తలు
-
Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
-
Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Wife Kills Husband: ‘‘ఇంట్లోకి రావొద్దు’’.. బాత్రూమ్ హత్య కేసులో సంచలన విషయాలు..
-
Pensions: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్షాక్.. లక్ష పెన్షన్లు కట్.. కారణం ఇదే..
-
KTR : చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్కు అప్పగించండి.. నీళ్లు ఎత్తి చూపిస్తాం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!