Third World War: దేశాల మధ్య వరుస దాడులు.. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel–Hamas war: ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితులను భట్టి చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా కనిపిస్తుంది. మొదట రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది.. ఆ తర్వాత ఇజ్రాయెల్-హమాస్ వివాదం కొనసాగుతుంది.. ఇప్పుడు హౌతీ యెమెన్ యుద్ధం ఈ మూడు కారణాల వల్ల థార్డ్ వరల్డ్ వార్ రాబోతుందా? అనే పరిస్థితులతో ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతుంది. అయితే, ఇజ్రాయెల్ ఇప్పటికే హమాస్, హిజ్బుల్లాతో యుద్ధం కొనసాగిస్తుంది. ఇప్పుడు హౌతీ తిరుగుబాటుదారులపై దాడి పశ్చిమాసియాలో యుద్ధ పరిధిని పెంచే అవకాశం ఉంది. ఈ దాడులన్నీ కలిసి పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉంది. హౌతీ సంక్షోభం కారణంగా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: BJP: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్ర..
Also Read
అయితే, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ లేదా హౌతీ రెబల్స్ సంక్షోభం జరిగిన ఎక్కడా కాల్పుల విరమణ ఒప్పందం కనిపించడం లేదు.. ఇజ్రాయెల్ సైన్యం ఈ రోజు గాజా స్ట్రిప్పై దాడి చేసింది. ఈ వైమానిక దాడిలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఇందులో హమాస్ నుక్బా ఫోర్స్ కమాండర్ కూడా హతమైనట్లు తెలుస్తుంది. ఇక, హమాస్ ఆ తర్వాత హిజ్బుల్లా యోధులు ఇజ్రాయెల్పై డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగిస్తున్నారు. లెబనాన్ నుంచి దాడులు జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో పరిస్థితి గాజా స్ట్రిప్ కంటే దారుణంగా ఉంది.
Read Also: Chandrababu: నేడు అరకు, అమలాపురంలో చంద్రబాబు పర్యటన.. పోలీసుల ఆంక్షలు..
ఇక, రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైనిక పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో 42 చోట్ల యుద్ధం జరుగుతోందని పేర్కొన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఉక్రెయిన్పై రష్యా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. అప్పుడు అమెరికా దాని మిత్ర దేశాలు అణు దాడి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాయి. ఏదైనా ఒక దేశం అణు క్షిపణులను ప్రయోగిస్తే మూడవ ప్రపంచ యుద్ధం ప్రమాదం మరింత పెరుగుతుంది.
Read Also: Venkateswara Stotram: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది.
అలాగే, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు కూడా మరో వైపు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం కనిపిస్తుంది. ఇక, తాజాగా అమెరికా హౌతీ రెబల్స్ పై దాడి చేసింది. దీంతో పాటు ఇటివల ఇరాన్- పాకిస్థాన్ మధ్య క్షిపణులతో దాడులు జరిగాయి. ఇక, తాజాగా ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఈ సమస్యపై చర్చించుకుని యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి యుద్ధాలను నిలిపివేయకపోతే మూడవ ప్రపంచ యుద్ధం అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!