Amit Shah Manipur visit: మణిపూర్కు అమిత్షా.. రెండు వర్గాల రాజీకి ప్రయత్నం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Manipur visit: దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లుతున్న మణిపూర్లో శాంతి వాతావరణం నెలకొల్పడానికి స్వయంగా కేంద్ర హోం మంత్రే రంగంలోకి దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు చేరుకోనున్నారు. నాలుగు రోజులపాటు అక్కడే ఉండి.. రెండు వర్గాలతో శాంతి చర్చలు జరపనున్నారు. జూన్ 1 వరకు నాలుగు రోజులపాటు హోం మంత్రి మణిపూర్లోనే ఉండనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రెండు రోజుల క్రితం శాంతిభద్రతలపై సమీక్ష చేశారు. పరిస్థితి మెరుగుపడిందని భావిస్తున్న సమయంలో తిరిగి ఆదివారం పలు ఎన్కౌంటర్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్మీ చీఫ్ ఉండి శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహిస్తున్నప్పటికీ .. ఇంఫాల్ లోయలో శాంతియుత వాతావరణం ఏర్పడ లేదు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఇంఫాల్ చేరుకోనున్నారు. మెయిటీలు, కుకీ రెండు వర్గాల వారు సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు శాంతి. సహనాలతో ఉండాలని కేంద్ర హోం మంత్రి అభ్యర్థించనున్నారు. రెండు వర్గాలతోనూ కేంద్ర హోం మంత్రి ప్రత్యేకంగా చర్చించనున్నారు. రెండు వర్గాలతో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పాలనే ప్రధాన ఉద్దేశంతోనే అమిత్ షా ఇంఫాల్ పర్యటన చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మెయిటీ– కుకీ తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్లో మే 3వ తేదీ నుంచి అశాంతి నెలకొంది. అప్పటినుంచి మణిపూర్లో ఇంటర్నెట్ బంద్ చేశారు. 34 వేల మంది కేంద్ర భద్రతా దళాలను రాష్ట్రంలో మోహరించారు. వాస్తవానికి మణిపూర్కు చెందిన 25పైగా కుకీ తిరుగుబాటు వర్గాలతో కేంద్ర ప్రభుత్వం–రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం కిందట త్రైపాక్షిక శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం తిరుగుబాటుదారులు ప్రభుత్వం నిర్దేశించిన శిబిరాలకు పరిమితం కావాలి. ఆయుధాలను పక్కనపెట్టాలి. కానీ, మెయిటీలు ఎస్టీ హోదా డిమాండ్ చేస్తుండడం.. గువాహటి హైకోర్టు దానికి మద్దతుగా తీర్పు ఇవ్వడంతో.. కుకీలు మళ్లీ ఆయుధాలు చేతబట్టడంతో ఘర్షణలు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?