Hussain Sagar: ‘హుస్సేన్ సాగర్’కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hussain Sagar: హైదరాబాద్.. నవాబులు పాలించిన ప్రాంతం. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఎంతోమంది రాజులు ఆయా ప్రాంతాలను పాలిస్తూ వచ్చారు. హైదరాబాద్ అప్పట్లో భాగ్యనగరంగా నవాబులు పరిపాలించారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ కాలంలో నవాబులు కట్టించిన ఆయా కట్టడాలు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వారి గుర్తుగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ నగరం పేరు చెప్పగానే చాలామందికి గుర్తు వచ్చే వాటిలో చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, హైదరాబాద్ బిర్యాని గుర్తుకు వస్తాయి. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో ప్రముఖంగా చెప్పే ప్రదేశాలలో హుస్సేన్ సాగర్ కూడా ముందు ఉంటుంది. అయితే ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా..? తెలియకపోతే ఏం పర్లేదు.. ఇప్పుడు దాని వివరాలు ఒకసారి చూద్దాం..
హైదరాబాద్ ను పాలించిన నవాబులలో నవాబ్ ఇబ్రాహీం కులీఖుతుబ్షా కూడా ఒకరు. ఆయన అల్లుడి పేరు హుస్సేన్ షా. ఇతను పర్షియా (ఇరాన్) నుండి హైదరాబాద్ కు వలస వచ్చాడు. ఆ కాలంలో అతను ఓ ఇంజనీరు. నవాబు తన కూతురు ఖైరాతీబేగంను హుసేన్షాకు ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆమె ఆరోగ్యం బాగులేక హకీంల సలహాపై గాలిమార్పుకోసం హైదరాబాద్, లష్కర్ (సికింద్రాబాద్ పాత పేరు) మధ్యలో ఒక చెరువు గట్టున కొన్ని రోజుల విశ్రాంతి కోసం బస చేశారు. ఇంజనీరు అయినా హుస్సేన్ షాకు ఆ చెరువు చూడగానే ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. అదే విషయాన్ని నవాబుకి చెప్పాడు. దానితో ఆయన అల్లుడి సలహాను సరే అన్నాడు.
Also Read
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
దానితో అతడు వందలాదిమంది వొడ్డెర కూలీలతో ఆ చెరువును లోతుగా తవ్వి బాగా వెడల్పు చేసి గగన్ పహాడ్ నుండి రాళ్లను తెప్పించి ఇటు హైదరాబాద్ కు అటు లష్కర్ కు మధ్య ఆనకట్టను కట్టారు. దాని నిర్మాణం 1563లో పూర్తి అయ్యింది. అపుడు హుస్సేన్ షా వలీ దానిపేరు ‘ఇబ్రాహీం సాగర్’ అని పెడదామనుకున్నాడు. కానీ, అప్పటికే కూలీలు, ప్రజలు ఆ ప్రాంతాన్ని హుస్సేన్ నిలబడి కట్టించాడు కాబట్టి ‘హుస్సేన్ సాగర్’గా పిలవటం ప్రారంభించేసరికి ఆ పేరే ఖాయం అయ్యింది. అయితే ఆ తర్వాత నవాబు కూడా తన పేరు లేనందుకు నారాజ్ అయ్యాడని గ్రహించిన అల్లుడు ఇక్కడ ఈ చెరువును తవ్వించాడు. దీని పేరు ఇబ్రాహీం సాగర్ అయ్యింది.
ఆ తర్వాత ఈ కట్ట కింద వెలిసిన ఊరే ఇబ్రాహీంపట్నం అయ్యింది. ఈ రెండు చెరువుల నిర్మాణం పని పూర్తి అయిన తర్వాత హుస్సేన్ షా సూఫీ సాధువుగా మారిపోయాడు. అన్ని సంబంధాలను తెంచుకుని “వలీ”గా మారాడు. ఆయన సమాధి హైదరాబాద్ షేక్ పేట్ లో ఉంది. దానిపేరు హుస్సేన్షా వలీ దర్గా.
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!