Dayanidhi Maran: హిందీ భాషపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తూనే ఉంది.. మరీ ముఖ్యంగా తమపై హిందీని బలవంతంగా రుద్దవద్దని దక్షిణ భారత్లోని రాష్ట్రాలు పలు సందర్భాలు స్పష్టం చేశాయి.. ఇదే సమయంలో.. కొన్నిసార్లు హిందీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. తాజాగా, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.. ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. హిందీని తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేశారు.. అందులో భాగంగా.. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు కడుతున్నారు.. రోడ్లు శుభ్రం చేస్తున్నారని పేర్కొన్నారు.. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. కొందరు సపోర్ట్ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు దయానిధి మారన్పై ఫైర్ అవుతున్నారు..
Read Also: Sriya Reddy: సలార్ కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాను షాక్ చేస్తున్న శ్రీయ రెడ్డి…
తమిళనాడుకు వచ్చే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల వాసులు.. హిందీ మాట్లాడేవారు.. ఇక్కడ నిర్మాణ పనులు లేదా రోడ్లు, మరుగుదొడ్లు శుభ్రం చేయడం వంటి నీచమైన పనులు చేస్తుంటారని మారన్ వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఇక, ఆ వీడియోపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందిస్తూ.. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.. ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరం అన్నారు. మొదట రాహుల్ గాంధీ ఉత్తర భారత ఓటర్లను అవమానించారు. కొందరు బీహార్ డీఎన్ఏను దుర్భాషలాడారు. అప్పుడు డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ “గౌమూత్ర రాష్ట్రాలు” అన్నారు. ఇప్పుడు దయానిధి మారన్ హిందీ మాట్లాడేవారిని, ఉత్తరాది వారిని అవమానించాడు. సనాతన ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, ఆపై విభజించి రూల్ కార్డ్ ప్లే చేయడం ఇండియా కూటమి యొక్క డీఎన్ఏ.. నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, లాలూ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించరా? వారు ఎప్పుడు స్టాండ్ తీసుకుంటారు? అంటూ బీజేపీ నాయకుడు ఎక్స్లో పోస్ట్ చేశారు.
Read Also: Cold Intensity: తెలంగాణలో చలి పంజా.. సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
ఇక, డీఎంకే ఎంపీ సెంథిల్కుమార్ పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో చేసిన వ్యాఖ్యలతో వివాదానికి దారితీసిన కొద్ది రోజుల తర్వాత మారన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమిళనాడు నాయకుడు, ఇటీవలి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలను ఎగతాళి చేస్తూ, హిందీ హార్ట్ల్యాండ్ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. ప్రధానంగా హిందీ హార్ట్ల్యాండ్ రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలుపొందడంలో బీజేపీకి ఉన్న శక్తి ఉంది. మీరు దక్షిణ భారతదేశానికి రాలేరు అని ఆయన అన్నారు. సంచలనం రేపిన సెంథిల్కుమార్ చేసిన వ్యాఖ్యను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు.