Hijab Ban: అంతా తూచ్ అలాంటిదేమీ లేదు.. పరీక్షలలో హిజాబ్ నిషేధంపై రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijab Ban: కర్ణాటకలో పరీక్షల సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు డ్రెస్ కోడ్ జారీ చేసింది. అందులో అన్ని రకాల హిజాబ్లను నిషేధించారు. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (కేఈఏ) ఈ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే రాజకీయ వర్గాల్లో పెను దుమారం చెలరేగింది. ఈ నిర్ణయంపై ఒమర్ అబ్దుల్లా నుంచి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరకు పలువురు నేతలు కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.పెరుగుతున్న వివాదం చూసి కర్ణాటక ప్రభుత్వం పరీక్షలో హిజాబ్పై నిషేధం లేదని ప్రకటన విడుదల చేసింది. బోర్డు, కార్పొరేషన్ పరీక్షల్లో హిజాబ్పై నిషేధం లేదని కర్ణాటక ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ తెలిపారు. ఒవైసీ, అబ్దుల్లాలు గళం లేవనెత్తిన తర్వాత సుధాకర్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
Read Also:Bhatti Vikramarka: ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
పరీక్ష గదిలో బ్లూటూత్, ఇతర పరికరాలను ఉపయోగించడం ద్వారా మోసం జరగకుండా నిరోధించడానికి తలపై క్యాప్ లేదా ఏదైనా ఇతర దుస్తులు ధరించడం నిషేధించబడిన డ్రెస్ కోడ్ను జారీ చేసినట్లు పరీక్షల మండలి (కెఇఎ) తెలిపింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షల సమయంలో హిజాబ్ను నిషేధించిందని, రాష్ట్రంలో గత భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం విధించిన నిషేధాన్ని రద్దు చేయడానికి చర్యలు తీసుకోలేదని ఒవైసీ విమర్శించారు.
Read Also:Minister Taneti Vanitha: వైసీపీ సింగిల్గానే పోటీచేస్తుంది.. మళ్లీ జగనే సీఎం..
అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలలో హిజాబ్ను నిషేధించింది. గత బిజెపి ప్రభుత్వ హయాంలో హిజాబ్ నిషేధాన్ని కూడా రద్దు చేయలేదు. ఆర్ఎస్ఎస్ను కర్ణాటక మోడల్ను తెలంగాణలో అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ భావిస్తున్నారు. హిజాబ్ను నిషేధించడం ద్వారా మా ఉద్దేశం ఏ మతాన్ని కించపరచడం కాదని కర్ణాటక ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ అన్నారు. చాలా సార్లు, కొంతమంది విద్యార్థులు తమ ముఖాలను హిజాబ్, టోపీ లేదా గుడ్డతో కప్పే ముసుగులో నకిలీ వస్తువులను తీసుకురావడం వల్ల మాత్రమే ఈ నిబంధన అమలు చేయబడింది. అనంతరం ఎంసీ సుధాకర్ మాట్లాడుతూ.. ఈ నిబంధనను తప్పుగా చూస్తున్న వారు నవంబర్ 18, 19 తేదీల్లో జరిగే పరీక్షల్లో ఎలాంటి హిజాబ్పై నిషేధం లేదని స్పష్టం చేశారు. హిజాబ్ ధరించిన విద్యార్థినులు పరీక్షకు గంట ముందు రావాలని, కట్టుదిట్టమైన తనిఖీల తర్వాతే లోపలికి అనుమతిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈసారి మోసాలను అరికట్టేందుకు విద్యాశాఖ మంత్రి మరిన్ని మెటల్ డిటెక్టర్లను అమర్చారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!