Minister Taneti Vanitha: వైసీపీ సింగిల్గానే పోటీచేస్తుంది.. మళ్లీ జగనే సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Taneti Vanitha: ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.. సార్వత్రిక ఎన్నికలతో పాటు.. ఏపీ అసెంబ్లీకి కూడా ఒకేసారి పోల్ నిర్వహించనున్నారు.. అయితే, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. గతంలో ఏ ప్రభుత్వం అందించిన విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని అన్నారు. టీడీపీ-జనసేన కలిసికట్టుగా వచ్చినా.. వైసీపీకి ఢోకా లేదన్నారు.. టీడీపీ-జనసేన ఎన్నికల్లో గెలవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణ చేస్తున్నాయని మండిపడ్డారు..
Read Also: Colours swathi : ఆ సమయంలో సినిమాలు మానేద్దాం అనుకున్నాను.. కానీ
Also Read
రాజమండ్రిలో 50 లక్షల రూపాయలు వ్యయంతో చేపడుతున్న జైళ్ల శాఖ ప్రాంతీయ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆమె.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. ఖైదీలను అర్థం చేసుకునే విధంగా జైలు సిబ్బందికి శిక్షణ ఉంటుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత. కాగా, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని టీడీపీ-జనసేన నిర్ణయించిన విషయం విధితమే.. ఇక, ఉమ్మడి కార్యాచరణ దిశగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగుతుండగా.. మరోవైపు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి రెండు పార్టీలు.. ఇప్పటికే మినీ మేనిఫెస్టో పేరుతో కొన్ని కీలక హామీలను ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?