Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News High Court Says File Case On Those 5 Government Employees

High Court: ఆ అధికారులపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం

Published Date :July 24, 2024 , 8:12 pm
By Kothuru Ram Kumar
  • ఆ ఐదుగురు అధికారులపై కేసు నమోదు చేయండి.
  • ప్రభుత్వ భూమిని ప్రవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు.
  • కుషాయిగూడ పోలీసులకు హైకోర్టు ఆదేశం.
High Court: ఆ అధికారులపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana High Court: ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములుగా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసినట్లు ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్ స్పష్టం చేశారు. కాప్రా మాజీ తహశీల్దార్ ఎస్తేర్ అనిత, మాజీ సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కాప్రా మండల సర్వేయర్ శ్రీష్మా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై మరింత విచారణ జరిపి, అభియోగ పత్రం దాఖలు చేయాలని కుషాయిగూడ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను న్యాయవాది సుంకర నరేష్ బుధవారం నాడు వెల్లడించారు.

CM Chandrababu: మంత్రులు, ఉన్నతాధికారులతో ముగిసిన సీఎం భేటీ.. స్వీట్‌ వార్నింగ్..!

కాప్రా మండలంలోని సర్వే నెంబర్ 199 లోని ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ 177లో పట్టా భూమిగా చూపిస్తూ కొంతమంది భూ ఆక్రమణ దారులతో కలిసి ఆ సమయలో ఉన్న కాప్రా మండల తహశీల్దార్ ఎస్తేర్ అనిత, మండల సర్వేయర్ శ్రీష్మా, రెవిన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పు ధ్రువపత్రాలు జారీ చేసి, పూర్వపు రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కుతూ వారికీ ఇష్టం వచ్చినట్లు లొకేషన్ స్కెచ్స్ మ్యాప్ జారీ చేశారని ఆయన తెలిపారు. వీరందరూ ఆ సమయంలో సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసారని.. అధికారులు చేస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను కుషాయిగూడకు చెందిన చప్పిడి కృష్ణారెడ్డి అనే సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుక వెళ్లగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సదరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిర్దారిస్తూ వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిసిఎల్ఏ కమీషనర్ కు తెలిపారు.

Tamannaah Bhatia: అందచందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న తమన్నా..

ఇక ఈ నివేదిక ఆధారంగా.. కృష్ణారెడ్డి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో అవినీతి అధికారులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు అందించారు. కానీ., పోలీసులు పట్టించుకోకపోవడంతో న్యాయవాది సుంకర నరేష్ ద్వారా మల్కాజిగిరి కోర్టులో కేసు వేయగా ప్రభుత్వ అధికారుల మీద కేసు నమోదు చేయడానికి ముందస్తు అనుమతి తప్పనిసరని కింది కోర్టు ఆ కేసును తిరస్కరించింది. దీంతో న్యాయవాది సుంకర నరేష్ కింది కోర్టు ఉత్తర్వులు సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించారు. అధికారులు ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని విధుల్లో నేరానికి పాల్పడిన వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఎవరి నుండి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు తెలిపింది. ఈ కేసు సంబంధించి కింది కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ.. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మరింత లోతైన విచారణ చేపట్టి కోర్టులో నేర అభియోగపత్రం దాఖలు చేయాలని హైకోర్టు కుషాయిగూడ పోలీసులను ఆదేశించిందని బాధితుడి తరుపు న్యాయవాది సుంకర నరేష్ చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5 government employees
  • file case
  • fraud
  • land issue
  • Telangana High Court

తాజావార్తలు

  • Chicken Price Hike: రంజాన్ వేళ.. చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..

  • Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ – ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!

  • WhatsAppaలో సరికొత్త ఫీచర్.. టెన్షన్‌ లేకుండా సీక్రెట్‌ మెసేజ్‌లు..!

  • Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!

  • Iran-US War Ending: ట్రంప్ కీలక ప్రకటన.. ‘ఇరాన్‌తో యుద్ధం ముగించే ఆలోచన ఉంది’..

ట్రెండింగ్‌

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions