Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Cm Chandrababu Meeting With Ministers And Senior Officials

CM Chandrababu: మంత్రులు, ఉన్నతాధికారులతో ముగిసిన సీఎం భేటీ.. స్వీట్‌ వార్నింగ్..!

Published Date :July 24, 2024 , 7:13 pm
By Sudhakar Ravula
  • మంత్రులు.. ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం..
  • ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై ఫోకస్ పెట్టాలని ఆదేశం..
  • కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని వెల్లడి..
CM Chandrababu: మంత్రులు, ఉన్నతాధికారులతో ముగిసిన సీఎం భేటీ.. స్వీట్‌ వార్నింగ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: మంత్రులు, ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.. కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలని వెల్లడించారు ముఖ్యమంత్రి.. మూసధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచన చేయాలని సూచించారు.. పరిపాలనలో భాగంగా అధికారులకు తన వైపు నుంచి 100 శాతం మద్దతు ఉంటుందని తెలిపారు.. అధికారులకు వీలైనంత వరకు హ్యాండ్ హోల్డింగ్ అందిస్తానన్నారు సీఎం చంద్రబాబు..

Read Also: CM Revanth Reddy : కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం… నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం

ఇక, ఓవైపు ఆదేశాలు ఇస్తూనే.. మరోవైపు వార్నింగ్‌లు కూడా ఇచ్చేశారు సీఎం చంద్రబాబు.. అధికారులెవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తానూ కఠినంగా ఉంటానని స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజ స్థాపనే తన లక్ష్యంగా పని చేయాలని సూచించారు.. గంటల తరబడి సమీక్షలకు తాను స్వస్తి పలికానని గుర్తుచేసుకున్నారు.. అధికారులు కూడా రిజల్ట్ ఒరియేంటెడ్ పద్ధతిలో సమీక్షలు చేపట్టాలని కీలక సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, ఇప్పటికీ అధికార యంత్రాంగం సరిగ్గా వ్యవహరించడం లేదనే భావనలో ఉన్నారట ప్రభుత్వ పెద్దలు.. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సమావేశం అంటున్నారు.. మదనపల్లె సంఘటనతో ప్రభుత్వ యంత్రాంగంలో లోపాలు బయట పడ్డాయని చంద్రబాబు భావిస్తున్నారట.. అధికారులకు ప్రభుత్వ ప్రాధాన్యతలు వివరించడం.. పరిపాలనపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేయడానికి ఈ కీలక భేటీ నిర్వహించారు సీఎం చంద్రబాబు..

నేను 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ, ఎప్పుడూ లేనన్ని సమస్యలు, భిన్నమైన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందన్నారు చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతోంది. నాడు తీసుకున్న నిర్ణయాలు, తెచ్చిన పాలసీల వ‌ల్లే అక్కడ ఈ ఫలితాలు వచ్చాయి. అమెరికాలో కూడా భార‌తీయులు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నారు. వైట్ అమెరికన్స్ 65 వేల డాలర్లు తలసరి ఆదాయం పొందుతున్నారు. కానీ, ఇండియన్స్ 1.19 లక్షల డాలర్ల తలసరి ఆదాయం పెంచుతున్నారు. తెలుగు వాళ్లు ప్రపంచంలో, దేశంలో ముందుకు వెళుతున్నారు. కానీ, ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెల‌కొందని ఆవేదన వ్యక్తం చేశారు. 1978లో నేను తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను. మొన్న ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. 57 శాతం ఓట్ షేర్ వచ్చింది. గత 5 ఏళ్లు ప్రజలు పడిన కష్టాల కారణంగా వచ్చిన ఫలితం ఇది అన్నారు. ప్రజలు గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అని ఇతర రాష్ట్రాలకు ఉపాదికోసం వెళ్లిన వాళ్లు.. ఇతర దేశాల్లో ఉన్న వారు వచ్చి ఓట్లు వేశారు. మొన్నటి ఎన్నికలు ఒక నిశ‌బ్ద విప్లవం… ఈ ఫ‌లితాల‌తో ఒక కొత్త చరిత్రకు నాంది పలికారని పేర్కొన్నారు..

2014లో లోటు బడ్జెట్ తో పాలన ప్రారంభించినా 43 శాతం పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులకు అండగా నిలిచాం అన్నారు చంద్రబాబు.. 2014 కంటే దారుణమైన పరిస్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయి. రూ.ల‌క్ష కోట్ల వ‌ర‌కు బిల్లులు, బకాయిలు ఉన్నాయి. పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. నాడు 13.5 శాతం వృద్ది రేటు సాధించిన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఇలా ఉంది. విభజనకంటే ఎక్కువ నష్టం 2019 నుంచి ఉన్న వైసీపీ పాలన వల్ల జరిగింది. కేంద్రం ఆక్సిజన్ అందిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. మూడు పార్టీలుగా కలిసి పోటీ చేశాం. కేంద్రం కూడా ఇప్పుడు సాయం చేయ‌డానికి ముందుకు వచ్చింది. ఇది మంచి పరిణామం. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రాయలసీమలో ఇండస్ట్రియల్ కారిడార్ కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అని చెప్పాం.. దాన్ని నిజం చేసి చూపించాలన్నారు.

ఏడాదిలో కేంద్రం నుంచి ఎంత మేర నిధులు తేగలం అనేది చూసి అంత‌మేర కేంద్రం నుంచి తీసుకు వచ్చేలా అధికారులు పనిచేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.. కేంద్రం పెట్టిన కొత్త బడ్జెట్ ప్రకారం నిధులు తెచ్చుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించండి. శాంతి భ‌ద్రత‌ల విష‌యంలో మా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. రౌడీలను అణిచివేస్తాం. గంజాయి అనేది లేకుండా చేస్తాం. ఈ విషయంలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. పేదరికం లేని సమాజం అనేది మా ప్రభుత్వం లక్ష్యం. దీని కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాలసీలు పక్కాగా అమలు చేయడం ద్వారా పేదరికం తగ్గించవచ్చు. కలిసి ముందుకు వెళదాం. ప్రగ‌తిశీల, ప్రభావాత్మక పాల‌న (ప్రోగ్రసివ్, ఎఫెక్టివ్ గవర్నెన్స్) అందిద్దాం. ఓట్లు వేరు.. ప్రజలకు మంచి చేయడం వేరు. ప్రతి పనికీ రాజకీయ ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ మంచి చేశాం అనే ఒక తృప్తి ఉంటుంది. నా అరెస్టు సమయంలో అంతమంది రోడ్డెక్కడానికి కారణం అంతకుముందు నేను చేసిన మంచే కారణం. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.. అధికారులు కూడా బ్యూరోక్రటిక్ కోణం కాకుండా.. మాన‌వీయ కోణంతో పనిచేయాలి. ప్రజలు సాయం కోరి వస్తే.. ఆ సమస్య ఎలా పరిష్కరించాలి అని ఆలోచించాలి. కేవ‌లం రూల్స్ గురించి మాత్రమే ఆలోచిస్తే అందరికీ మంచి చేయలేం అన్నారు సీఎం చంద్రబాబు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Govt.
  • AP Ministers
  • cm chandrababu
  • janasena
  • pawan kalyan

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions