NTV Telugu Site icon

BJP : బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Ts High Court

Ts High Court

బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవచ్చని న్యాయస్థానం తీర్పునిచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం లో ప్రభుత్వం వైఫల్యం పై మహా ధర్నా చేయనుంది బీజేపీ. అయితే.. ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ శ్రేణులు. దీంతో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. అయితే.. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ప్రభుత్వ తరుపు న్యాయ వాది హైకోర్టు ముందు వాదనలు వినిపించారు.

Also Read : Baby Collections: బేబీ మూవీ అనూహ్యమైన రికార్డు

దీంతో.. కేంద్రం ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా ? అని ప్రశ్నించింది న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన న్యాయస్థానం… 5వేల మందికి మీరు భద్రత కల్పించలేక పోతే ఎలా అని ప్రశ్నించింది. దీంతో.. రేపటి బీజేపీ మహాధర్నాకు 500 మంది మాత్రమే ధర్నా లో పాల్గొనాలని, ఎలాంటి ర్యాలీ లు చెప్పటవద్దని సూచించింది హైకోర్టు. పోలీసులు అనుమతి నిరాకరించడంపై హై కోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వేరే కారణాల చూపుతూ ఎందుకు ధర్నా కు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించింది హైకోర్టు.. 1000 మంది వస్తారని, ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న కారణంగా అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వం తరుఫు న్యాయవాది వెల్లడించారు.

Also Read : Baby Collections: బేబీ మూవీ అనూహ్యమైన రికార్డు

1000 మందికే భద్రత ఇవ్వలేకుంటే 1 కోటి మందిని ఎలా కాపాడుతారని హై కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం పై ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఎలాంటి అభ్యంతరాలు చెప్పరని, ప్రతిపక్షాలు ధర్నా చేసేటప్పుడు మాత్రమే అన్ని అభ్యంతరాలు పెడుతున్నారని, ఒక కేబినెట్‌ మినిస్టర్ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఎలా అని హైకోర్టు వ్యాఖ్యానించింది.