High Court: డీప్ఫేక్లు, ఏఐలను నియంత్రించేందుకు ఏం చేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
- డీప్ఫేక్లు & ఏఐలను నియంత్రించేందుకు ఏం చేస్తున్నారు..
- కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న.
- మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court Questioned Central Government: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్ఫేక్ టెక్నాలజీని నియంత్రించేందుకు ఏం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 21న జరగనుంది. డీప్ఫేక్ల ద్వారా వీడియోలు సృష్టించి అప్లోడ్ చేస్తున్నారని, వాటి ద్వారా వ్యక్తుల గురించి తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నారని కోర్టు పేర్కొంది. డీప్ఫేక్ల వినియోగం పెరిగిపోయిందని, అందుకే వాటిని ఎదుర్కోవడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. దీనిపై కేంద్రం సీరియస్గా ఆలోచించాలి.
Read Also: Governor Jishnu Dev Sharma: నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో గవర్నర్ పర్యటన..
Also Read
- 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా కమిటీని ఏర్పాటు చేశారా అని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇంకా కమిటీ వేయకపోతే కోర్టు కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపింది. అనంతరం కేంద్రం తరఫున హాజరైన ఏఎస్జీ చేతన్ శర్మ.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ దీనిని పరిశీలిస్తోందని చెప్పారు. ఈ విషయం సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం సమాచారాన్ని బహిరంగపరచలేమని చేతన్ శర్మ అన్నారు. అప్పుడు కోర్టు కమిటీ గురించి అంతా చెప్పొద్దని, అయితే దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవాలని అన్నారు. దీనిపై మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
Read Also: Governor Jishnu Dev Sharma: నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో గవర్నర్ పర్యటన..
ఈ అంశంపై చట్టం చేయడాన్ని పరిశీలించాలని ఆగస్టు 26న హైకోర్టు కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇది ప్రపంచ సమస్య అని, తక్షణమే దృష్టి సారించాలని కోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!