Rain in Adilabad : ఆదిలాబాద్లో భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు, వంకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy rains in adilabad district
కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురియడంతో వాగులు పొంగిపొర్లుతూ రవాణా వ్యవస్థపై ప్రభావం చూపింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 49.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బెజ్జూరు మండలంలో అత్యధికంగా 96 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జైనూర్ మండలంలో అత్యల్పంగా 24 మి.మీ నమోదైంది. జూన్ 1 నుంచి ఆగస్టు 8 వరకు 587 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా జిల్లా వ్యాప్తంగా 1,232 మి.మీలుగా వర్షపాతం నమోదైంది. 110 శాతం అధికంగా నమోదైందని అధికారులు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో సగటు వర్షపాతం 27.9 మి.మీ నమోదు కాగా.. హాజీపూర్ మండలంలో అత్యధికంగా 44.9 మి.మీ, జైపూర్ మండలంలో 38.5 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 598 మి.మీ.తో పోల్చితే జిల్లాలో1,123 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 88 శాతం ఎక్కవని తెలిపారు అధికారులు. కాగా, ఆదిలాబాద్ జిల్లాలో సగటున 25.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో 19.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
Also Read
- INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
భారీ వర్షాలకు కొండ వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. దిగువ స్థాయి వంతెనలు, రహదారులను వరదలు ముంచెత్తాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బెజ్జూర్, దహెగావ్, పెంచికల్పేట్ మండలాల్లోని అంతర్గత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమన్నారు. కొమురం భీమ్ ప్రాజెక్టుకు 13,173 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి 243 మీటర్లకు గాను నీటిమట్టం 238.9 మీటర్లకు చేరుకుంది. 1.50 మీటర్ల ఎత్తు వరకు మూడు గేట్లను ఎత్తి మిగులు జలాలను దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు వచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి, వరి, సోయా, ఎర్రజొన్నలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. ఈ వ్యవసాయ సీజన్లో జులై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు.
తాజావార్తలు
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!