Heavy Rain: పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షం.. 12 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడికి జనాలు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు బయపడే పరిస్థితి నెలకొంది.కాగా.. పశ్చిమ బెంగాల్లో పరిస్థితి భిన్నంగా మారింది. అప్పటి వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన పశ్చిమ బెంగాల్ లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
READ MORE:Aashu Reddy: స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న ఆశు రెడ్డి…
Also Read
- FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
ఉరుములు, మెరుపులు , ఈదురుగాలులతో కూడి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వర్షానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎక్స్ వేదికగా వెల్లడించారు. పుర్బా బుర్ద్వాన్లో ఐదుగురు, పశ్చిమ్ మెదినీపూర్లో ఇద్దరు, పురూలియాలో ఇద్దరు ప్రాణలు కోల్పోయినట్లు చెప్పారు. నదియాలో గోడ కూలి ఇద్దరు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెట్టుకూలి ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వర్షాల కారణంగా మరణించిన వారికి ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు.
తూర్పు రైల్వే యొక్క సీల్దా డివిజన్లోని సీల్దా-కానింగ్ లైన్లోని సబర్బన్ రైలు సేవలు గంటకు పైగా నిలిచిపోయాయి. ఉరుములతో కూడిన వర్షం సమయంలో అరటి ఆకులు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ వైర్పై పడినట్లు ఒక అధికారి తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి 9.15 గంటల వరకు రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా నుంచి కోల్కతాకు వచ్చే కొన్ని విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్గాలు తెలిపాయి. కోల్ కతాకు వచ్చే మూడు విమానాల్లో ఢిల్లీ నుంచి వచ్చే రెండు, బాగ్డోగ్రా నుంచి కోల్ కతాకు వచ్చే ఒక విమానాలన్ని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. కోల్కతా నుంచి రాంచీకి వెళ్లాల్సిన విమానం ఉరుములతో కూడిన వర్షం మధ్య టేకాఫ్ కాకపోవడంతో పార్కింగ్ బే వద్దకు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మే 10 వరకు ఈ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!