Heavy Rain: పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షం.. 12 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడికి జనాలు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు బయపడే పరిస్థితి నెలకొంది.కాగా.. పశ్చిమ బెంగాల్లో పరిస్థితి భిన్నంగా మారింది. అప్పటి వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన పశ్చిమ బెంగాల్ లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
READ MORE:Aashu Reddy: స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న ఆశు రెడ్డి…
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఉరుములు, మెరుపులు , ఈదురుగాలులతో కూడి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వర్షానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎక్స్ వేదికగా వెల్లడించారు. పుర్బా బుర్ద్వాన్లో ఐదుగురు, పశ్చిమ్ మెదినీపూర్లో ఇద్దరు, పురూలియాలో ఇద్దరు ప్రాణలు కోల్పోయినట్లు చెప్పారు. నదియాలో గోడ కూలి ఇద్దరు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెట్టుకూలి ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వర్షాల కారణంగా మరణించిన వారికి ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు.
తూర్పు రైల్వే యొక్క సీల్దా డివిజన్లోని సీల్దా-కానింగ్ లైన్లోని సబర్బన్ రైలు సేవలు గంటకు పైగా నిలిచిపోయాయి. ఉరుములతో కూడిన వర్షం సమయంలో అరటి ఆకులు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ వైర్పై పడినట్లు ఒక అధికారి తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి 9.15 గంటల వరకు రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా నుంచి కోల్కతాకు వచ్చే కొన్ని విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్గాలు తెలిపాయి. కోల్ కతాకు వచ్చే మూడు విమానాల్లో ఢిల్లీ నుంచి వచ్చే రెండు, బాగ్డోగ్రా నుంచి కోల్ కతాకు వచ్చే ఒక విమానాలన్ని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. కోల్కతా నుంచి రాంచీకి వెళ్లాల్సిన విమానం ఉరుములతో కూడిన వర్షం మధ్య టేకాఫ్ కాకపోవడంతో పార్కింగ్ బే వద్దకు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మే 10 వరకు ఈ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!