Heavy Rain: పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షం.. 12 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడికి జనాలు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు బయపడే పరిస్థితి నెలకొంది.కాగా.. పశ్చిమ బెంగాల్లో పరిస్థితి భిన్నంగా మారింది. అప్పటి వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన పశ్చిమ బెంగాల్ లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
READ MORE:Aashu Reddy: స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న ఆశు రెడ్డి…
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఉరుములు, మెరుపులు , ఈదురుగాలులతో కూడి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వర్షానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎక్స్ వేదికగా వెల్లడించారు. పుర్బా బుర్ద్వాన్లో ఐదుగురు, పశ్చిమ్ మెదినీపూర్లో ఇద్దరు, పురూలియాలో ఇద్దరు ప్రాణలు కోల్పోయినట్లు చెప్పారు. నదియాలో గోడ కూలి ఇద్దరు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెట్టుకూలి ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వర్షాల కారణంగా మరణించిన వారికి ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు.
తూర్పు రైల్వే యొక్క సీల్దా డివిజన్లోని సీల్దా-కానింగ్ లైన్లోని సబర్బన్ రైలు సేవలు గంటకు పైగా నిలిచిపోయాయి. ఉరుములతో కూడిన వర్షం సమయంలో అరటి ఆకులు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ వైర్పై పడినట్లు ఒక అధికారి తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి 9.15 గంటల వరకు రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా నుంచి కోల్కతాకు వచ్చే కొన్ని విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్గాలు తెలిపాయి. కోల్ కతాకు వచ్చే మూడు విమానాల్లో ఢిల్లీ నుంచి వచ్చే రెండు, బాగ్డోగ్రా నుంచి కోల్ కతాకు వచ్చే ఒక విమానాలన్ని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. కోల్కతా నుంచి రాంచీకి వెళ్లాల్సిన విమానం ఉరుములతో కూడిన వర్షం మధ్య టేకాఫ్ కాకపోవడంతో పార్కింగ్ బే వద్దకు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మే 10 వరకు ఈ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?