GANJA: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత.. కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్
- భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత
- కోటి రూపాయల విలువచేసే గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు
- నిజామాబాద్ కార్పొరేటర్ కుమారుని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు
- గత పది సంవత్సరాల నుంచి గంజాయి బిజినెస్ చేస్తున్న కార్పొరేటర్ కుమారుడు మునవర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణా పట్టుబడింది. భారీగా గంజాయిని తరలిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ కొడుకుతో పాటు మరో కేసులో తల్లి కొడుకు కూడా పట్టుబడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేశారు. ఈ ఘటనలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని.. 10 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నిజామాబాద్ ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ కుమారుడు మహమ్మద్ మునవర్ అలీ ప్రధాన నిందితుడు కావడం విశేషం.
Read Also: Musi River: మూసీ ఒడ్డున కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ స్టార్ట్..
Also Read
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
- Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
గత కొన్నేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో పోలీసులు కన్నుగప్పి గంజాయి అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరి వద్ద నుంచి సుమారు కోటి రూపాయల విలువైన 319 కేజీల గంజాయిని మరియు రెండు కార్లు, రెండు బైకులు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి అక్రమ రవాణాలో నిజామాబాద్ ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ కుమారుడైన మునావర్ ఆలీతో పాటు మరో కుటుంబం పూర్తిగా గంజాయి వ్యాపారంలో మునిగి తేలుతుంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ల అరుణ, ఆమె కుమారుడు నేరెళ్ల అఖిల్ ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు నుంచి 100 కేజీల గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. తల్లీ కొడుకులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడడం విశేషం. నేరెళ్ల అరుణ భర్త కూడా సదయ్య గంజాయి వ్యాపారం చేస్తూ అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.
Read Also: Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు
అయితే ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అనేకసార్లు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ మునావర్ అలీ.. వీరితో చేతులు కలిపి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు నుంచి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు వీరిని భద్రాచలం పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేకమని ఇలా పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అలాగే సమాజ హితం కోసం ఎవరు కూడా మత్తు పదార్థాలు అలవాటు కావద్దని.. ముఖ్యంగా మత్తు పదార్థాలు అలవాటు పడిన యువత తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని పేర్కొన్నారు. అత్యంత చాకచక్యంగా అంతర్రాష్ట్ర గంజాయి ముఠా ఆట కట్టించిన భద్రాచలం ఎక్సైజ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
తాజావార్తలు
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!