Pakistan-Afghanistan Clash: తాలిబాన్, పాక్ సైన్యాల మధ్య ఘర్షణ.. సరిహద్దులో కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Afghanistan Clash: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ప్రధాన సరిహద్దులో బుధవారం కాల్పులు జరిగాయని, ఆ తర్వాత ఆఫ్ఘన్-పాకిస్తాన్ సరిహద్దును మూసివేసినట్లు పాకిస్తాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. స్థానిక నివాసితుల ప్రకారం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లను కలిపే టోర్ఖమ్ సరిహద్దులో కాల్పుల శబ్దాలు వినిపించాయి. కాల్పుల శబ్ధాలు వినడంతో అక్కడున్న ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. ఈ ఘటన తర్వాత టోర్ఖమ్ సరిహద్దును మూసివేశారు. తాలిబన్లు, పాకిస్థాన్ భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయని భద్రతా అధికారి ఒకరు వార్తా సంస్థ రాయిటర్స్తో చెప్పారు. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Also Read: PM Modi: ఉదయనిధి “సనాతన” వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోడీ..
Also Read
- Sanju Samson: కోహ్లీ సలహాలు నేను పట్టించుకోను.. సంచలన వ్యాఖ్యలు చేసిన సంజూ శాంసన్..
- Heavy Rain Alert: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
- Pakistan: భారత్లా పాకిస్తాన్లో విద్యార్థి ఉద్యమాలు సాధ్యం కావు.. ఎందుకంటే.?
- Modi-IAS: తన రాజీనామా ఆమోదించండి.. ప్రధాని మోడీకి మాజీ ఐఏఎస్ వినతి
అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు నంగహార్ ప్రావిన్స్లోని ప్రభుత్వ ప్రతినిధి, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ఈ కాల్పులపై ఇంకా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం చాలా కాలంగా కొనసాగుతోందని సంగతి తెలిసిందే. ఇరు దేశాల పౌరులు టోర్ఖమ్ సరిహద్దు గుండా మాత్రమే వచ్చి వెళతారు. అయినప్పటికీ, రెండు దేశాల మధ్య అనేక వివాదాల కారణంగా, ఈ సరిహద్దును మూసివేయవలసి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా టోర్ఖమ్ సరిహద్దును మూసివేశారు. దీంతో సరిహద్దుకు ఇరువైపులా వేలాది ట్రక్కులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇరువర్గాల నుంచి కాల్పులు జరిగిన విషయంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
తాజావార్తలు
-
Sanju Samson: కోహ్లీ సలహాలు నేను పట్టించుకోను.. సంచలన వ్యాఖ్యలు చేసిన సంజూ శాంసన్..
-
Kitchen Hacks : పిండి కలిపేటప్పుడు.. ఇవి కలిపితే.. చపాతీ పొంగి దూదిలా పొంగుతుంది..
-
Heavy Rain Alert: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
-
Pakistan: భారత్లా పాకిస్తాన్లో విద్యార్థి ఉద్యమాలు సాధ్యం కావు.. ఎందుకంటే.?
-
Modi-IAS: తన రాజీనామా ఆమోదించండి.. ప్రధాని మోడీకి మాజీ ఐఏఎస్ వినతి
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!