Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర గర్భగుడిని చూశారా?.. రామయ్య కొలువుదీరేది ఇక్కడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోట్లాది భారతీయ రామభక్తుల కల అయోధ్యలో రామమందిర నిర్మాణంతో సాకారం కాబోతోంది. ఇప్పుడు శ్రీరాముడి విగ్రహం ఆలయం రూపుదిద్దుకుంటుంది. మరి కొన్ని నెలల్లో రాముడు తన ఆలయంలో కొలువు తీరనున్నాడు. అయితే.. దేవుడి దర్శనం కోసం వెళ్లే ప్రదేశంలో రామ మందిరం మొదటి దశలో దాదాపు 167 స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ స్తంభాలపై శిల్పాలు కనబడతాయి. కళాకారులు ప్రస్తుతం స్తంభాలపై విగ్రహాలను చెక్కుతున్నారు. కళాకారులు పూర్తి ఏకాగ్రతతో స్తంభాలపై విగ్రహాలను చెక్కుతున్నారు. ఆలయ ప్రారంభం కోసం రోజులు దగ్గర పడుతుండటంతో పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని ఆలయ కమిటీ చెబుతుంది.
Read Also: Malla Reddy: కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే, చీకటి రోజులు వస్తాయి.. మల్లారెడ్డి హాట్ కామెంట్స్
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
అయోధ్యలో నిర్మించే రామమందిరాన్ని ప్రత్యేక రాళ్లతో నిర్మిస్తున్నారు. ప్రతి రాయిపై అద్భుతమైన శిల్పాలను చెక్కుతున్నారు. ఇక్కడి అద్భుతమైన కళాకారులు ఈ రాళ్లకు ప్రాణం పోస్తున్నారని చెప్పొచ్చు. తీర్థ క్షేత్ర ట్రస్ట్కు చెందిన అనిల్ మిశ్రా.. ప్రతి రాయిపై ఇలాంటి శిల్పాలు చెక్కడం చూడదగినవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ చిత్రాలను చూసేందుకు రామ భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన వెల్లడించార. అయితే, ఈ రామమందిర స్తంభాలపై పలు చోట్ల నిర్మాణంలో కాషాయ జెండా కూడా కనిపిస్తుంది. రాంలాలా స్వామి నివసించే గర్భగుడి ఇది.. ఈ గర్భగుడి వెడల్పు దాదాపు 20 అడుగులు ఉంటుంది.
Read Also: PV Sindhu: షట్లర్ మహ్మద్ హఫీజ్ హషీమ్ను తన కొత్త కోచ్గా ప్రకటించిన పివీ సింధు..
ఆలయం మొదటి దశలో దాదాపు 167 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు పింక్ ఇసుకరాయితో తయారు చేశారు. ఈ స్తంభాలపై దేవతామూర్తుల విగ్రహాలను చెక్కారు. ఈ స్తంభాలపై నర్తకి, హనుమంతుడు, వానర్ సేన , శివుని విగ్రహాలు చెక్కబడ్డాయని కళాకారులు తెలిపారు. ఈ చిత్రాలలో నిలబడి ఉన్న భారీ స్తంభాలను చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఈ స్తంభాల గుండా వెళ్లే రహదారి కూడా కనబడుతుంది. గర్భగుడి చుట్టూ నిర్మించిన వృత్తాకార మార్గం.. రాంలాలా ఈ గర్భగుడిలో కూర్చున్న తర్వాత, రామ భక్తులు ఈ మార్గం గుండా రాముడిని దర్శించుకుంటారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!