Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర గర్భగుడిని చూశారా?.. రామయ్య కొలువుదీరేది ఇక్కడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోట్లాది భారతీయ రామభక్తుల కల అయోధ్యలో రామమందిర నిర్మాణంతో సాకారం కాబోతోంది. ఇప్పుడు శ్రీరాముడి విగ్రహం ఆలయం రూపుదిద్దుకుంటుంది. మరి కొన్ని నెలల్లో రాముడు తన ఆలయంలో కొలువు తీరనున్నాడు. అయితే.. దేవుడి దర్శనం కోసం వెళ్లే ప్రదేశంలో రామ మందిరం మొదటి దశలో దాదాపు 167 స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ స్తంభాలపై శిల్పాలు కనబడతాయి. కళాకారులు ప్రస్తుతం స్తంభాలపై విగ్రహాలను చెక్కుతున్నారు. కళాకారులు పూర్తి ఏకాగ్రతతో స్తంభాలపై విగ్రహాలను చెక్కుతున్నారు. ఆలయ ప్రారంభం కోసం రోజులు దగ్గర పడుతుండటంతో పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని ఆలయ కమిటీ చెబుతుంది.
Read Also: Malla Reddy: కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే, చీకటి రోజులు వస్తాయి.. మల్లారెడ్డి హాట్ కామెంట్స్
Also Read
- GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
- Anjanadri Temple: బంగారం కాదు రాగి?.. ఆంజనాద్రి అంజన్న ఆలయంలో ఆభరణాల విరాళ వివాదం!
- AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
- High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
అయోధ్యలో నిర్మించే రామమందిరాన్ని ప్రత్యేక రాళ్లతో నిర్మిస్తున్నారు. ప్రతి రాయిపై అద్భుతమైన శిల్పాలను చెక్కుతున్నారు. ఇక్కడి అద్భుతమైన కళాకారులు ఈ రాళ్లకు ప్రాణం పోస్తున్నారని చెప్పొచ్చు. తీర్థ క్షేత్ర ట్రస్ట్కు చెందిన అనిల్ మిశ్రా.. ప్రతి రాయిపై ఇలాంటి శిల్పాలు చెక్కడం చూడదగినవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ చిత్రాలను చూసేందుకు రామ భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన వెల్లడించార. అయితే, ఈ రామమందిర స్తంభాలపై పలు చోట్ల నిర్మాణంలో కాషాయ జెండా కూడా కనిపిస్తుంది. రాంలాలా స్వామి నివసించే గర్భగుడి ఇది.. ఈ గర్భగుడి వెడల్పు దాదాపు 20 అడుగులు ఉంటుంది.
Read Also: PV Sindhu: షట్లర్ మహ్మద్ హఫీజ్ హషీమ్ను తన కొత్త కోచ్గా ప్రకటించిన పివీ సింధు..
ఆలయం మొదటి దశలో దాదాపు 167 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు పింక్ ఇసుకరాయితో తయారు చేశారు. ఈ స్తంభాలపై దేవతామూర్తుల విగ్రహాలను చెక్కారు. ఈ స్తంభాలపై నర్తకి, హనుమంతుడు, వానర్ సేన , శివుని విగ్రహాలు చెక్కబడ్డాయని కళాకారులు తెలిపారు. ఈ చిత్రాలలో నిలబడి ఉన్న భారీ స్తంభాలను చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఈ స్తంభాల గుండా వెళ్లే రహదారి కూడా కనబడుతుంది. గర్భగుడి చుట్టూ నిర్మించిన వృత్తాకార మార్గం.. రాంలాలా ఈ గర్భగుడిలో కూర్చున్న తర్వాత, రామ భక్తులు ఈ మార్గం గుండా రాముడిని దర్శించుకుంటారు.
తాజావార్తలు
-
GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
-
Anjanadri Temple: బంగారం కాదు రాగి?.. ఆంజనాద్రి అంజన్న ఆలయంలో ఆభరణాల విరాళ వివాదం!
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!